యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నరసింహ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా పునర్నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయ పనుల నిమిత్తం వెండి తొడుగులకు వినియోగించే... 891 కిలోల 489 గ్రాముల వెండిని హైదరాబాద్ చర్లపల్లిలోని ప్రభుత్వ మింట్కు అందజేశారు.
![Yadadri temple silver move to Cherlapally mint](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10860902_1-1.jpg)
ఆ వెండిని శుద్ధి చేయుట, నాణ్యత ప్రమాణాల కోసం ఆలయ ఈఓ గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహ మూర్తి, ఆలయ అధికారుల సమక్షంలో పంపిణీ చేశారు. ఆలయ అధికారులు వెండిని, కొలతలు చేసి లెక్కించి వాటిని ప్రత్యేకంగా తరలించారు.
ఇదీ చూడండి : వేయి స్థంభాల ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఎప్పుడో తెలుసా?