ETV Bharat / state

చర్లపల్లికి యాదాద్రి ఆలయ వెండి తరలింపు - చర్లపల్లిలో ప్రభుత్వ మింట్​

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సంబంధించిన వెండి కడ్డీలు, తొడుగులు కలశాల తయారీకి వినియోగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 891 కిలోల 489 గ్రాముల వెండి కడ్డీలను హైదరాబాద్​ చర్లపల్లిలోని ప్రభుత్వ మింట్​కు బుధవారం తరలించారు.

Yadadri temple silver move to Cherlapally mint
చర్లపల్లికి యాదాద్రి ఆలయ వెండి తరలింపు
author img

By

Published : Mar 4, 2021, 1:57 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నరసింహ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా పునర్నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయ పనుల నిమిత్తం వెండి తొడుగులకు వినియోగించే... 891 కిలోల 489 గ్రాముల వెండిని హైదరాబాద్​ చర్లపల్లిలోని ప్రభుత్వ మింట్​కు అందజేశారు.

Yadadri temple silver move to Cherlapally mint
చర్లపల్లికి యాదాద్రి ఆలయ వెండి తరలింపు

ఆ వెండిని శుద్ధి చేయుట, నాణ్యత ప్రమాణాల కోసం ఆలయ ఈఓ గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహ మూర్తి, ఆలయ అధికారుల సమక్షంలో పంపిణీ చేశారు. ఆలయ అధికారులు వెండిని, కొలతలు చేసి లెక్కించి వాటిని ప్రత్యేకంగా తరలించారు.

ఇదీ చూడండి : వేయి స్థంభాల ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఎప్పుడో తెలుసా?

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నరసింహ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా పునర్నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయ పనుల నిమిత్తం వెండి తొడుగులకు వినియోగించే... 891 కిలోల 489 గ్రాముల వెండిని హైదరాబాద్​ చర్లపల్లిలోని ప్రభుత్వ మింట్​కు అందజేశారు.

Yadadri temple silver move to Cherlapally mint
చర్లపల్లికి యాదాద్రి ఆలయ వెండి తరలింపు

ఆ వెండిని శుద్ధి చేయుట, నాణ్యత ప్రమాణాల కోసం ఆలయ ఈఓ గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహ మూర్తి, ఆలయ అధికారుల సమక్షంలో పంపిణీ చేశారు. ఆలయ అధికారులు వెండిని, కొలతలు చేసి లెక్కించి వాటిని ప్రత్యేకంగా తరలించారు.

ఇదీ చూడండి : వేయి స్థంభాల ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఎప్పుడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.