యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలోని ఇళ్ల మధ్యలో ఉన్న డంపింగ్ యార్డును జిల్లా భాజపా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు సందర్శించారు. డంపింగ్ యార్డు వల్ల వచ్చే దుర్వాసనతో గ్రామస్థులు వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు.
గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో డంపింగ్ యార్డును నిర్మించాలన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లేశం పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆరు నెలల పిల్లాడు... అదరగొట్టేశాడు!