ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో యాదాద్రి జల్లా పోచంపల్లి-కొత్తగూడెం మధ్య వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ఇందులో 35 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వరద, జోరు వాన వల్ల బస్సు దిగి గట్టుమీదకు చేరుకున్నారు. చుట్టూ నీరు ఉండటం వల్ల ప్రయాణికులు అక్కడే నిలిచిపోయారు. ప్రయాణికులను రక్షించటానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు పోచంపల్లి-కొత్తగూడెం మధ్య గల పిల్లాయిపల్లి కాలువ వరదలో ఓ యువతి చిక్కుకుంది. కాలువ మధ్యలో ఉన్న చెట్టును పట్టుకొని ఉంది. యువతిని రక్షించేందుకు పోలీసులు, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పోచంపల్లికి ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇదీ చదవండి: హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు