సూర్యాపేట జిల్లా నాగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో... రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ సోకిన వారికి మెరుగైన సేవలు అందించాలని... ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు సూచించారు. కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ఐసోలేషన్లు, హాం క్వారంటైన్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
కరోనాను అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పవన్ కుమార్, పీహెచ్ఎన్ ధనమ్మ, హెల్త్ సూపర్వైజర్ మార్ నాత, నాగమ్మ, జయమ్మ, ఇందిరా, విజయలక్ష్మి, రోజా, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.