యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. దిశ నిందితులను వెంటనే శిక్షించాలని, అమ్మాయిలపై జరుగుతున్న నేరాలను అరికట్టాలని, దిశ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. స్థానిక విజ్ఞాన్ స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీనగర్ మీదుగా అమరవీరుల స్తూపం వరకు సాగింది. అక్కడకు చేరుకున్న విద్యార్థులు దిశకు నివాళులర్పించారు.
ఇవీచూడండి: దత్తత తల్లిదండ్రుల వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్య