ETV Bharat / state

Saidabad Incident: అడ్డగూడురులోనే రాజు దొరికిండు... పోలీసులే చంపేశారు: రాజు తల్లి - Saidabad Incident accused family respond on raju suicide

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సైదాబాద్‌ ఆత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్యపై వారి కుటుంబ సభ్యులు స్పందించారు. రాజుది ఆత్మహత్య కాదు... పోలీసులే చంపేశారని ఆరోపిస్తున్నారు.

saidabad-incident-accused-family-respond-on-raju-suicide
saidabad-incident-accused-family-respond-on-raju-suicide
author img

By

Published : Sep 16, 2021, 2:14 PM IST

Updated : Sep 16, 2021, 2:29 PM IST

రాజు ఆత్మహత్యపై అతని తల్లి స్పందన

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సైదాబాద్‌ ఆత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే ట్రాక్ వద్ద బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి, మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అయితే రాజు ఆత్మహత్యపై అతని కుటుంబ సభ్యులు స్పందించారు. రాజును పోలీసులే కాల్చిచంపేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహం అప్పగించాలని కోరుతున్నారు. రాజును పోలీసులే పొట్టనపెట్టుకున్నారని విలపిస్తున్నారు.

సైదాబాద్​ పోలీస్​స్టేషన్​లో మమ్మల్ని ఉంచారు. నిన్ననే వదిలి వేశారు. పోలీస్​స్టేషన్​లోనే ఆరు రోజులు ఉన్నాం. రాజు దొరికితేనే వదిలేస్తామని చెప్పారు. నిన్నటికి నిన్న ఏమైందో తెలియదు మమ్మల్ని ఉప్పల్​లో రాత్రి 9 గంటలకు వదిలేశారు. ఏమైంది అని అడిగితే ఎన్​కౌంటర్​ అర్డర్​ వచ్చింది చేసేస్తాం అని చెప్పారు. అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాం. చనిపోయిన అతను మా ఆయనే.. ఇప్పటి వరకు ఎవరూ ఫోన్​ చేయలేదు. నిన్న పదిసార్లు పచ్చబొట్టు గురించి అడిగారు. నాతో మా ఆయన తాగకపోతే మంచిగానే ఉండే వాడు. ఆయన అట్ల చేయడు అనుకున్నాం...

- నిందితుడు రాజు భార్య

రాజు ఆత్మహత్యపై అతని భార్య స్పందన

అడ్డగూడురులోనే పోలీసులు రాజును పట్టుకెళ్లారు. ఇప్పుడేమో ఆత్మహత్య అంటున్నారు. మా కొడుకు శవం అప్పగించండి. మూడు రోజుల కిందటే దొరికిండు అన్నారు. చంపేశారు కదా.. ఇంకేముంది.

- నిందితుడు తల్లి

10 వ తేదీ మా బంధువుల ఇంటికి వెళ్తుంటే.. పోలీసులు పట్టుకున్నారు. మీ తమ్ముడు చిన్నారిని రేప్​ చేసి చంపేశాడు అని చెప్పారు. కానీ మేము నమ్మలేదు. రాజుకు చిన్నపిల్లలంటే ఇష్టం. సైదాబాద్​ పోలీస్ స్టేషన్​లో ఉంచారు. నిన్న రాత్రికి రాత్రే వదిలేశారు. డబ్బులిచ్చి బస్సు ఎక్కించి పంపించారు.

- నిందితుడు అక్క

ఇవీ చూడండి:

రాజు ఆత్మహత్యపై అతని తల్లి స్పందన

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సైదాబాద్‌ ఆత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే ట్రాక్ వద్ద బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి, మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అయితే రాజు ఆత్మహత్యపై అతని కుటుంబ సభ్యులు స్పందించారు. రాజును పోలీసులే కాల్చిచంపేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహం అప్పగించాలని కోరుతున్నారు. రాజును పోలీసులే పొట్టనపెట్టుకున్నారని విలపిస్తున్నారు.

సైదాబాద్​ పోలీస్​స్టేషన్​లో మమ్మల్ని ఉంచారు. నిన్ననే వదిలి వేశారు. పోలీస్​స్టేషన్​లోనే ఆరు రోజులు ఉన్నాం. రాజు దొరికితేనే వదిలేస్తామని చెప్పారు. నిన్నటికి నిన్న ఏమైందో తెలియదు మమ్మల్ని ఉప్పల్​లో రాత్రి 9 గంటలకు వదిలేశారు. ఏమైంది అని అడిగితే ఎన్​కౌంటర్​ అర్డర్​ వచ్చింది చేసేస్తాం అని చెప్పారు. అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాం. చనిపోయిన అతను మా ఆయనే.. ఇప్పటి వరకు ఎవరూ ఫోన్​ చేయలేదు. నిన్న పదిసార్లు పచ్చబొట్టు గురించి అడిగారు. నాతో మా ఆయన తాగకపోతే మంచిగానే ఉండే వాడు. ఆయన అట్ల చేయడు అనుకున్నాం...

- నిందితుడు రాజు భార్య

రాజు ఆత్మహత్యపై అతని భార్య స్పందన

అడ్డగూడురులోనే పోలీసులు రాజును పట్టుకెళ్లారు. ఇప్పుడేమో ఆత్మహత్య అంటున్నారు. మా కొడుకు శవం అప్పగించండి. మూడు రోజుల కిందటే దొరికిండు అన్నారు. చంపేశారు కదా.. ఇంకేముంది.

- నిందితుడు తల్లి

10 వ తేదీ మా బంధువుల ఇంటికి వెళ్తుంటే.. పోలీసులు పట్టుకున్నారు. మీ తమ్ముడు చిన్నారిని రేప్​ చేసి చంపేశాడు అని చెప్పారు. కానీ మేము నమ్మలేదు. రాజుకు చిన్నపిల్లలంటే ఇష్టం. సైదాబాద్​ పోలీస్ స్టేషన్​లో ఉంచారు. నిన్న రాత్రికి రాత్రే వదిలేశారు. డబ్బులిచ్చి బస్సు ఎక్కించి పంపించారు.

- నిందితుడు అక్క

ఇవీ చూడండి:

Last Updated : Sep 16, 2021, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.