ETV Bharat / state

ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు : ప్రియాంక గాంధీ

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2023, 3:04 PM IST

Updated : Nov 27, 2023, 6:50 PM IST

Priyanka Gandhi Bhuvanagiri Election Campaign : పదేళ్ల పాలన చూసిన ప్రజలకు ఐదేళ్లు ఎలాంటి పాలన కావాలో ఎన్నుకునే సమయం వచ్చిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక అన్నారు. ప్రజలు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించాలని సూచించారు. రాజస్థాన్, కర్ణాటకలో అధికారంలోకి రాగానే ఎలా గ్యారెంటీలను అమలు చేశామో.. తెలంగాణలోనూ అలాగే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Priyanka Gandhi Election campaign in Telangana
Priyanka Gandhi Bhuvanagiri Election Campaign

Priyanka Gandhi Bhuvanagiri Election Campaign : పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో.. రాబోయే ఐదేళ్లు ఎలాంటి పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాక గాంధీ (Priyanka Gandhi ) అన్నారు. భువనగరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఇది ఎన్నికల సమయమని.. ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై అవగాహన లేదని.. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలన్న ఆలోచనలేదని విరుచుకుపడ్డారు. దేశంలో నోట్ల రద్దు, కరోనా, జీఎస్టీ వల్ల ప్రజలు అనేక సార్లు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.

6 గ్యారెంటీలు తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం : ప్రియాంక గాంధీ

'కష్టాల సమయంలో ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోలేదు. ఉద్యోగాలు కావాలన్న యువత కలలను ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. మహిళలపై రోజూ అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రజల చిన్నచిన్న సమస్యలను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు. రైతులను కూడా ఈ ప్రభుత్వం ఆదుకోలేదు.. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి'- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత

సామాన్యులతో ప్రియాంకా గాంధీ సందడి - హుస్నాబాద్​లో ఆ కుటుంబానికి సర్​ప్రైజ్

Priyanka Gandhi Election campaign in Telangana : రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన యువతకు రాష్ట్రంలో ఎలాంటి న్యాయం జరగలేదని ప్రియాంక గాంధీ విమర్శించారు. ఎంతో కష్టపడి పరీక్షలు రాస్తే.. పేపర్లు లీక్ చేసి యువత జీవితాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భవిష్యత్ బాగుంటుందని యువత పోరాడితే వారి జీవితం అంధకారమైందని పేర్కొన్నారు.

జోరందుకున్న కాంగ్రెస్​ ప్రచారం - ​ ఆ 18 నియోజకవర్గాలపైనే ప్రధాన ఫోకస్

Priyanka Gandhi Bhuvanagiri Election Campaign ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు ప్రియాంక గాంధీ

బీఆర్ఎస్ పాలనలో కిందస్థాయి మొదలుకుని పై స్థాయి వరకు అంతా అవినీతిమయమని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాత్రమే ధనవంతులయ్యారని.. పేదల జీవితాలు ఏమీ మారలేవన్నారు. ప్రజలు తమ జీవితాలను అమ్ముకునేది లేదని బీఆర్ఎస్ గట్టిగా చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Priyanka Gandhi Election Campaign in Bhuvanagiri : భువనగిరి ఎన్నికల ప్రచారం అనంతరం ప్రియాంక గాంధీ గద్వాలలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడిన ఆమె.. పదేళ్లుగా తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ పాలిస్తోంది.. కానీ ప్రజల కోసం ఏం చేసిందో అందరూ ఒకసారి ఆలోచించారని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే అందరు తమ కలలు నెరవేరతాయని భావించారు.. కానీ ఇప్పుడు అది కలగానే ఉందన్నారు. ఎంతోమంది యువత పోరాటం, త్యాగాల వల్లే తెలంగాణ కల సాకారమైందని తెలిపారు.

అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అగ్రనేతల ప్రచారం - నేడు రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ

ప్రజాధనం ప్రజలకే చెందాలనేదే కాంగ్రెస్‌ విధానం : ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Bhuvanagiri Election Campaign : పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో.. రాబోయే ఐదేళ్లు ఎలాంటి పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాక గాంధీ (Priyanka Gandhi ) అన్నారు. భువనగరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఇది ఎన్నికల సమయమని.. ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై అవగాహన లేదని.. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలన్న ఆలోచనలేదని విరుచుకుపడ్డారు. దేశంలో నోట్ల రద్దు, కరోనా, జీఎస్టీ వల్ల ప్రజలు అనేక సార్లు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.

6 గ్యారెంటీలు తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం : ప్రియాంక గాంధీ

'కష్టాల సమయంలో ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోలేదు. ఉద్యోగాలు కావాలన్న యువత కలలను ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. మహిళలపై రోజూ అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రజల చిన్నచిన్న సమస్యలను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు. రైతులను కూడా ఈ ప్రభుత్వం ఆదుకోలేదు.. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి'- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత

సామాన్యులతో ప్రియాంకా గాంధీ సందడి - హుస్నాబాద్​లో ఆ కుటుంబానికి సర్​ప్రైజ్

Priyanka Gandhi Election campaign in Telangana : రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన యువతకు రాష్ట్రంలో ఎలాంటి న్యాయం జరగలేదని ప్రియాంక గాంధీ విమర్శించారు. ఎంతో కష్టపడి పరీక్షలు రాస్తే.. పేపర్లు లీక్ చేసి యువత జీవితాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భవిష్యత్ బాగుంటుందని యువత పోరాడితే వారి జీవితం అంధకారమైందని పేర్కొన్నారు.

జోరందుకున్న కాంగ్రెస్​ ప్రచారం - ​ ఆ 18 నియోజకవర్గాలపైనే ప్రధాన ఫోకస్

Priyanka Gandhi Bhuvanagiri Election Campaign ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు ప్రియాంక గాంధీ

బీఆర్ఎస్ పాలనలో కిందస్థాయి మొదలుకుని పై స్థాయి వరకు అంతా అవినీతిమయమని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాత్రమే ధనవంతులయ్యారని.. పేదల జీవితాలు ఏమీ మారలేవన్నారు. ప్రజలు తమ జీవితాలను అమ్ముకునేది లేదని బీఆర్ఎస్ గట్టిగా చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Priyanka Gandhi Election Campaign in Bhuvanagiri : భువనగిరి ఎన్నికల ప్రచారం అనంతరం ప్రియాంక గాంధీ గద్వాలలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడిన ఆమె.. పదేళ్లుగా తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ పాలిస్తోంది.. కానీ ప్రజల కోసం ఏం చేసిందో అందరూ ఒకసారి ఆలోచించారని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే అందరు తమ కలలు నెరవేరతాయని భావించారు.. కానీ ఇప్పుడు అది కలగానే ఉందన్నారు. ఎంతోమంది యువత పోరాటం, త్యాగాల వల్లే తెలంగాణ కల సాకారమైందని తెలిపారు.

అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అగ్రనేతల ప్రచారం - నేడు రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ

ప్రజాధనం ప్రజలకే చెందాలనేదే కాంగ్రెస్‌ విధానం : ప్రియాంక గాంధీ

Last Updated : Nov 27, 2023, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.