యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన మల్లయ్య కరోనా టీకా వేయించుకునేందుకు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సమయంలో అంబేడ్కర్ కూడలి వద్ద ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై అధిక వేగంతో వచ్చి... మల్లయ్యను ఢీకొట్టారు. ఈ ఘటనలో మల్లయ్య ఎడమకాలుకు తీవ్రగాయాలయ్యాయి. కాలు విరిగింది.
విధి నిర్వహణలో ఉన్న పెట్రోలింగ్ పోలీసులు శ్రీశైలం, హుస్సేన్, ప్రవీణ్, శంకర్ తమ వాహనంలో ప్రథమ చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్న జనం మానవత్వం చాటుకున్న పోలీసులను శెభాష్ పోలీస్ అని కొనియాడారు.
ఇదీ చూడండి: ఒకరోజు పోలీస్ కమిషనర్ సాదిక్ క్యాన్సర్తో మృతి