ETV Bharat / state

భువనగిరి ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం తొమ్మిదైనా వైద్యులు, సిబ్బంది విధులకు హాజరుకాకపోవటంతో అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.

author img

By

Published : Jun 26, 2019, 6:00 PM IST

OFFICIALS INSPECTED BHUVANAGIRI DISTRICT GOVERNMENT HOSPITAL

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ అశోక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి ఆయన వెళ్లారు. కానీ..అక్కడ ఇద్దరు డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. నర్సులు, ఇతర సిబ్బంది విధులకు హాజరు కాకపోవటంపై అశోక్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్​ను ఫోన్ చేసి పిలిపించారు. సమయం దాటినా ఓపి సేవలను ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రయోగశాలలో పరీక్షలు చేసే టెక్నీషియన్స్ కూడా ఎవరూ అందుబాటులో లేకపోవటంపై మండిపడ్డారు. రోగులను, వారి బంధువులను వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రాత్రి వేళలో రక్త పరీక్షలు చేయించుకోవటానికి త్వరలోనే ఔట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమిస్తామని అశోక్ తెలిపారు. సమయానికి విధుల్లోకి రానివారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు

ఇవీ చూడండి: ప్రభుత్వ అధికారిపై బ్యాటుతో ఎమ్మెల్యే వీరంగం

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ అశోక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి ఆయన వెళ్లారు. కానీ..అక్కడ ఇద్దరు డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. నర్సులు, ఇతర సిబ్బంది విధులకు హాజరు కాకపోవటంపై అశోక్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్​ను ఫోన్ చేసి పిలిపించారు. సమయం దాటినా ఓపి సేవలను ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రయోగశాలలో పరీక్షలు చేసే టెక్నీషియన్స్ కూడా ఎవరూ అందుబాటులో లేకపోవటంపై మండిపడ్డారు. రోగులను, వారి బంధువులను వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రాత్రి వేళలో రక్త పరీక్షలు చేయించుకోవటానికి త్వరలోనే ఔట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమిస్తామని అశోక్ తెలిపారు. సమయానికి విధుల్లోకి రానివారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు

ఇవీ చూడండి: ప్రభుత్వ అధికారిపై బ్యాటుతో ఎమ్మెల్యే వీరంగం

TG_NLG_62_26_ASUPATRI_THANIKI_AB_C14 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : రాష్ట్ర వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ అశోక్ ఈరోజు ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిని ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఉదయం 9 గంటల కు ఆయన ఆసుపత్రికి చేరుకునే సమయానికి కేవలం ఇద్దరు డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. నర్సులు, ఇతర సిబ్బంది ఆసుపత్రికి రాలేదు. దీనితో ఆయన సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఫోన్ చేసి పిలిపించారు. సమయం దాటినా ఓపి సేవలను మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రయోగ శాలలో పరీక్షలు చేసే టెక్నిషి యన్స్ ఎవరూ అందుబాటు లేక పోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల ను , వారి బంధువులను వైద్య సేవల పై అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. లేబర్ రూమ్ అన్ని సదుపాయాలతో కొద్ధి రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. రాత్రి వేళలో రక్త పరీక్షలు చేయించు కోవడానికి త్వరలోనే ఔట్ సోర్సింగ్ విధానంలో నియమిస్తామని జాయింట్ కమీషనర్ అశోక్ తెలిపారు. సమయానికి విధుల్లోకి రాని ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది పై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. బైట్ : అశోక్ (వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.