యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం పల్లెర్ల గ్రామంలో మానవత్వం వెలుగుచూసిన ఘటన చోటుచేసుకుంది. మనషులు చనిపోతేనే పట్టించుకోని ఈ జనం... ఓ కోతి చనిపోతే దగ్గరుండి దహన సంస్కరాలు నిర్వహించారు.
అసలేం జరిగిందంటే....
గ్రామస్థులు ఓ వానరాన్ని సొంతమనిషికన్నా ఆప్యాయంగా పెంచుకున్నారు. ఆడుతూ ఎప్పుడు గెంతులు వేసే ఆ వానరంకు ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తగిలి చనిపోయింది. గ్రామస్థులు దానిని అలాగే వదిలేయకుండా...ఒక మనిషి చనిపోతే ఏ విధంగా అంత్యక్రియలు జరుపుతారో... అదే విధంగా వానరానికి చేపట్టారు. స్థానికుల సహకారంతో ఆ కోతికి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మనుషులుగా పుట్టి జంతువుల కబేళరానికి కూడా అంత్యక్రియలు నిర్వహించిన ఆ ఊరి గ్రామస్థులను అభినందించాల్సిందే. వారి మానవతా దృక్పథానికి సలాం కొట్టాల్సిందే.