భద్రతతో పాటు మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఒక్కో సీసీ కెమెరా 40 మంది కానిస్టేబుళ్లతో సమానమని ఆమె తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేటపేట, అహమ్మద్ నగర్లో సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
గ్రామంలో ప్రతి ఇంటి ముందు ఖాళీస్థలంలో మొక్కలు నాటి హరితహారం పెంపొందించాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు జరిగినా సీసీ కెమెరాలతో వెంటనే గుర్తించటం సులువవుతుందని తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులన్నీంటిని నెరవేరుస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.