ETV Bharat / state

Yadadri: 'ఈ నెల 28న సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకు అనుమతి'

Yadadri: ఈ నెల 28న యాదాద్రి ఆలయ మహాసంప్రోక్షణను వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకు అనుమతి ఇస్తామన్న మంత్రి.. ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు

author img

By

Published : Mar 26, 2022, 8:01 PM IST

Yadadri: మహాసంప్రోక్షణ తర్వాత భక్తులకు అనుమతి ఇస్తాం: ఇంద్రకరణ్​ రెడ్డి
Yadadri: మహాసంప్రోక్షణ తర్వాత భక్తులకు అనుమతి ఇస్తాం: ఇంద్రకరణ్​ రెడ్డి

Yadadri: అద్భుత శిల్పకళానైపుణ్యం, స్వర్ణమయ వెలుగుల మధ్య యాదాద్రి ఆలయం భక్తులకు స్వాగతం పలుకుతోంది. ఈ నెల 28న యాదాద్రి ఆలయ మహాసంప్రోక్షణను వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మహాసంప్రోక్షణ ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకు అనుమతి ఇస్తామన్న మంత్రి.. ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 9 గంటలకు మహా పూర్ణాహుతి, 9:30 గంటలకు బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర,11:55 గంటలకు మహా కుంభసంప్రోక్షణ, తదితర వైదిక కార్యక్రమాలుంటాయని మంత్రి వెల్లడించారు. అనంతరం నిర్మాణంలో పాలుపంచుకున్న వారిని సీఎం కేసీఆర్ సన్మానిస్తారని తెలిపారు.

మహాపూర్ణాహుతితో మొదలై..

ఉదయం 9 గంటల నుంచి మహాపూర్ణాహుతితో మొదలై మధ్యాహ్నం 2గంటల వరకు కార్యక్రమాలు ముగుస్తాయి. కావున 4గంటల నుంచి సందర్శకులు, భక్తులు దర్శనం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్​ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు, అందరిని కూడా సతీసమేతంగా రావాలని ఆహ్వానించారు. ఆహ్వానించిన అతిథులందరూ సకాలంలో వచ్చి జయప్రదం చేయాలి. -ఇంద్రకరణ్​ రెడ్డి, రాష్ట్ర మంత్రి

పూర్ణాహుతి ముగిసిన అనంతరం.. బాలాలయం నుంచి స్వామి వారిని ప్రధానాలయంలోకి తీసుకువస్తామని.. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత తెలిపారు. వెయ్యేళ్లపాటు వెలుగొందే.. యాదాద్రి మహా పుణ్యక్షేత్రాన్ని ఈ నెల 28న ప్రభుత్వ సూచనలు పాటిస్తూ.. భక్తులు దర్శించుకోవాలని ఆలయ ఈవో గీత సూచించారు.

ఈ దేవాలయ నిర్మాణంలో అంకితభావంతో పనిచేసిన వారందరిని సీఎం కేసీఆర్​ సన్మానించదలచుకున్నారు. దేవాలయం ప్రాంగణంలోనే వారికి సన్మానం పూర్తయిన తర్వాత భోజన విరామం అనంతరం భక్తులు యాదగిరిగుట్ట పైకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. -గొంగిడి సునీత, ప్రభుత్వ విప్​

మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం అవసరమైన పూజ కైంకర్యాలు ముగిసిన తర్వాత, అర్చకుల వేద ఆశీర్వచనం కొనసాగిన అనంతరం సామాన్య భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేశాం. సకుటుంబంగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. -గీతారెడ్డి, యాదాద్రి ఆలయ ఈవో

మహాసంప్రోక్షణ తర్వాత భక్తులకు అనుమతి ఇస్తాం: ఇంద్రకరణ్​ రెడ్డి

ఇదీ చదవండి:

Yadadri: అద్భుత శిల్పకళానైపుణ్యం, స్వర్ణమయ వెలుగుల మధ్య యాదాద్రి ఆలయం భక్తులకు స్వాగతం పలుకుతోంది. ఈ నెల 28న యాదాద్రి ఆలయ మహాసంప్రోక్షణను వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మహాసంప్రోక్షణ ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకు అనుమతి ఇస్తామన్న మంత్రి.. ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 9 గంటలకు మహా పూర్ణాహుతి, 9:30 గంటలకు బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర,11:55 గంటలకు మహా కుంభసంప్రోక్షణ, తదితర వైదిక కార్యక్రమాలుంటాయని మంత్రి వెల్లడించారు. అనంతరం నిర్మాణంలో పాలుపంచుకున్న వారిని సీఎం కేసీఆర్ సన్మానిస్తారని తెలిపారు.

మహాపూర్ణాహుతితో మొదలై..

ఉదయం 9 గంటల నుంచి మహాపూర్ణాహుతితో మొదలై మధ్యాహ్నం 2గంటల వరకు కార్యక్రమాలు ముగుస్తాయి. కావున 4గంటల నుంచి సందర్శకులు, భక్తులు దర్శనం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్​ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు, అందరిని కూడా సతీసమేతంగా రావాలని ఆహ్వానించారు. ఆహ్వానించిన అతిథులందరూ సకాలంలో వచ్చి జయప్రదం చేయాలి. -ఇంద్రకరణ్​ రెడ్డి, రాష్ట్ర మంత్రి

పూర్ణాహుతి ముగిసిన అనంతరం.. బాలాలయం నుంచి స్వామి వారిని ప్రధానాలయంలోకి తీసుకువస్తామని.. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత తెలిపారు. వెయ్యేళ్లపాటు వెలుగొందే.. యాదాద్రి మహా పుణ్యక్షేత్రాన్ని ఈ నెల 28న ప్రభుత్వ సూచనలు పాటిస్తూ.. భక్తులు దర్శించుకోవాలని ఆలయ ఈవో గీత సూచించారు.

ఈ దేవాలయ నిర్మాణంలో అంకితభావంతో పనిచేసిన వారందరిని సీఎం కేసీఆర్​ సన్మానించదలచుకున్నారు. దేవాలయం ప్రాంగణంలోనే వారికి సన్మానం పూర్తయిన తర్వాత భోజన విరామం అనంతరం భక్తులు యాదగిరిగుట్ట పైకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. -గొంగిడి సునీత, ప్రభుత్వ విప్​

మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం అవసరమైన పూజ కైంకర్యాలు ముగిసిన తర్వాత, అర్చకుల వేద ఆశీర్వచనం కొనసాగిన అనంతరం సామాన్య భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేశాం. సకుటుంబంగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. -గీతారెడ్డి, యాదాద్రి ఆలయ ఈవో

మహాసంప్రోక్షణ తర్వాత భక్తులకు అనుమతి ఇస్తాం: ఇంద్రకరణ్​ రెడ్డి

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.