ETV Bharat / state

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: భక్తులు లేక వెలవెలబోతున్న యాదాద్రి ఆలయం - yadadri temple news

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంపై లాక్‌డౌన్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యం భక్తులతో కళకళలాడే ఆలయం.. ప్రస్తుతం స్వామివారి దర్శనాలను నిలిపివేయడంతో వెలవెలబోతోంది. ఆలయ ఘాట్‌ రోడ్డు, దర్శన క్యూలైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు స్వామివారికి ప్రతిరోజు నిర్వహించే నిత్యకైంకర్యాలు అంతరంగికంగా యథావిధిగా కొనసాగుతున్నాయి.

యాదాద్రి ఆలయం
యాదాద్రి ఆలయం
author img

By

Published : May 13, 2021, 10:55 PM IST

నిత్యం భక్తులతో కిటకిటలాడే యాదాద్రి క్షేత్రం లాక్‌డౌన్ కారణంగా కళ తప్పింది. బుధవారం నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులోకి రావడంతో ఆలయ అధికారులు స్వామివారి దర్శనాలను నిలిపివేశారు. ఫలితంగా ఆలయ ప్రాంగణమంతా నిర్మానుష్యంగా మారింది.

సాధారణ రోజుల్లో వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే టెంపుల్ ఘాట్ రోడ్డు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తోంది. భక్తులతో నిత్యం సందడిగా ఉండే దర్శన క్యూలైన్లు, లడ్డూ ప్రసాద లైన్లు వెలవెలబోతున్నాయి. శివాలయం, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు బోసిపోయాయి. మరోవైపు భక్తులకు దర్శనాలు నిలిపివేసినప్పటికీ.. స్వామివారికి ప్రతిరోజు నిర్వహించే నిత్యకైంకర్యాలు అంతరంగికంగా యథావిధిగా కొనసాగుతున్నాయి.

నిత్యం భక్తులతో కిటకిటలాడే యాదాద్రి క్షేత్రం లాక్‌డౌన్ కారణంగా కళ తప్పింది. బుధవారం నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులోకి రావడంతో ఆలయ అధికారులు స్వామివారి దర్శనాలను నిలిపివేశారు. ఫలితంగా ఆలయ ప్రాంగణమంతా నిర్మానుష్యంగా మారింది.

సాధారణ రోజుల్లో వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే టెంపుల్ ఘాట్ రోడ్డు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తోంది. భక్తులతో నిత్యం సందడిగా ఉండే దర్శన క్యూలైన్లు, లడ్డూ ప్రసాద లైన్లు వెలవెలబోతున్నాయి. శివాలయం, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు బోసిపోయాయి. మరోవైపు భక్తులకు దర్శనాలు నిలిపివేసినప్పటికీ.. స్వామివారికి ప్రతిరోజు నిర్వహించే నిత్యకైంకర్యాలు అంతరంగికంగా యథావిధిగా కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: 'అధికారుల నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిసింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.