ETV Bharat / state

యాదాద్రి కొండపైన పెరిగిన భక్తుల రద్దీ

author img

By

Published : Mar 1, 2020, 4:21 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. ఓ పక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా... అందులోనూ ఆదివారం సెలవు కావటం వల్ల స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.

HEAVY RUSH IN YADADRI
HEAVY RUSH IN YADADRI

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ అధికమైంది. ఆదివారం సెలవుదినం కావటం వల్ల భక్తులు కుటుంబ సమేతంగా వస్తున్నారు. ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా... వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న స్వామివారిని కళ్లారా తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

కల్యాణ కట్ట, పుష్కరిణీ ప్రాంతాలు భక్తులతో కిటకిలాడుతున్నాయి. స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతోంది. మరోవైపు ఆలయ ఆభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.

యాదాద్రి కొండపైన పెరిగిన భక్తుల రద్దీ

ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ అధికమైంది. ఆదివారం సెలవుదినం కావటం వల్ల భక్తులు కుటుంబ సమేతంగా వస్తున్నారు. ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా... వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న స్వామివారిని కళ్లారా తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

కల్యాణ కట్ట, పుష్కరిణీ ప్రాంతాలు భక్తులతో కిటకిలాడుతున్నాయి. స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతోంది. మరోవైపు ఆలయ ఆభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.

యాదాద్రి కొండపైన పెరిగిన భక్తుల రద్దీ

ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.