అర్హులైన రైతులకు కొత్త పట్టా పాసు పుస్తకాలు వెంటనే ఇవ్వాలని జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు తహశీల్దారు కార్యాలయం ఎదుట బైఠాయించారు. సాదా బైనామాలు అమలు చేయాలని, వీఆర్వోల నిర్లక్ష్యం నశించాలని, దొంగ పట్టా పాసుబుక్కులను అరికట్టాలని నినాదాలు చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వీఆర్వోలు పట్టించుకోవట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పై అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండిః 'ఈ రైతు 116సార్లు కలెక్టర్ని కలిసినా ఫలితం లేదు'