ETV Bharat / state

'జన్మనిచ్చిన ఊరు.. చదువునేర్పిని బడిని వారు మరవలేదు'

author img

By

Published : Dec 8, 2019, 5:57 PM IST

జన్మనిచ్చిన ఊరు.. చదువు నేర్పిన పాఠశాల కోసం పూర్వ విద్యార్థులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్​పూర్​ ప్రభుత్వ పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

education minister sabitha indrareddy visit to yadadri bhuvanagiri district
యాదాద్రిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన
యాదాద్రిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. మల్యాలలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం జలాల్​పూర్​ ప్రభుత్వ పాఠశాల డైమండ్​ జూబ్లీ వేడుకలల్లో మంత్రి పాల్గొన్నారు. దాదాపు రూ.కోటి వరకు కార్పస్​ ఫండ్​తో పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన పూర్వ విద్యార్థులను అభినందించారు.

జన్మనిచ్చిన ఊరు.. చదువు నేర్పిన పాఠశాల కోసం వారు చేస్తున్న కృషి ఎనలేనిదని సబిత ప్రశంసించారు.

యాదాద్రిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. మల్యాలలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం జలాల్​పూర్​ ప్రభుత్వ పాఠశాల డైమండ్​ జూబ్లీ వేడుకలల్లో మంత్రి పాల్గొన్నారు. దాదాపు రూ.కోటి వరకు కార్పస్​ ఫండ్​తో పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన పూర్వ విద్యార్థులను అభినందించారు.

జన్మనిచ్చిన ఊరు.. చదువు నేర్పిన పాఠశాల కోసం వారు చేస్తున్న కృషి ఎనలేనిదని సబిత ప్రశంసించారు.

Intro:Tg_nlg_186_08_minister_visit_av_TS10134


యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..


వాయిస్: యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలో పర్యటించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మొదట మల్యాలలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ(కేజీబీవీ)లో రూ.2 కోట్ల5 లక్షలతో చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సబిత, జలాల్ పూర్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి హోదాలో సబిత మొదటిసారి బొమ్మలరామారం మండలం రావడంతో స్థానిక టీయారెస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. కేజీబీవీ శంకుస్థాపన కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శన చేసిన విద్యార్థులను అభినందించారు సబిత. అనంతరం జలాల్ పూర్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకలో పాల్గొని ప్రసంగించారు. పాఠశాలలో చదువుకుని ఉత్తీర్ణత సాధించి, పైచదువుల కోసం మొదటి 10th బ్యాచ్ పాఠశాల నుంచి బయటకు వెళ్లి 60 ఏండ్లు గడిచిన శుభసంద్భంగా స్కూల్ లో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. పాఠశాలకు సంబంధించిన పూర్వవిద్యార్థులంతా కలిసి ఇప్పటివరకు దాదాపు రూ.కోటి వరకు కార్పస్ ఫండ్ సమకూర్చి, ఈ డబ్బుతో పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ఉచిత చదువుల కోసం ఖర్చు చేస్తామన్న పూర్వవిద్యార్థుల సంకల్పం చాలా గొప్పదన్నారు మంత్రి సబిత. జన్మనిచ్చిన ఊరు, చదువునేర్పిన పాఠశాల కోసం పూర్వవిద్యార్థులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని ప్రశంసించారు సబిత.

బైట్లు: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.Body:Tg_nlg_186_08_minister_visit_av_TS10134Conclusion:Tg_nlg_186_08_minister_visit_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.