ETV Bharat / state

ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ

author img

By

Published : Jun 2, 2021, 7:23 PM IST

యాదగిరిగుట్టలో పాత్రికేయులకు కల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేశారు. యాదాద్రి జిల్లాలోని పలు గ్రామాల్లోని కరోనా బాధితులకు, సిబ్బందికి సైతం సరకులు పంపిణీ చేశారు.

Distribution of essentials
ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో పాత్రికేయులకు కల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ సభ్యులు సుంకరి సుభాశ్​, గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఛైర్మన్, తుర్కపల్లి మండలం మాధపూర్​కి చెందిన పబ్బా చిత్తారి ఆదేశానుసారం అందజేశారు.

భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి, నాగాయపల్లి, చీకటి మామిడి, మాధపూర్, మల్కాపూర్, ధర్మారం, వాసాలమర్రి గ్రామాల్లో కరోనా బాధిత కుటుంబాలకు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, తదితరులకు నిత్యావసరాలు అందించారు. సంస్థ ద్వారా మున్ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని సుంకరి సుభాశ్ ఈ సందర్భంగా​ తెలియజేశారు.

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో పాత్రికేయులకు కల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ సభ్యులు సుంకరి సుభాశ్​, గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఛైర్మన్, తుర్కపల్లి మండలం మాధపూర్​కి చెందిన పబ్బా చిత్తారి ఆదేశానుసారం అందజేశారు.

భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి, నాగాయపల్లి, చీకటి మామిడి, మాధపూర్, మల్కాపూర్, ధర్మారం, వాసాలమర్రి గ్రామాల్లో కరోనా బాధిత కుటుంబాలకు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, తదితరులకు నిత్యావసరాలు అందించారు. సంస్థ ద్వారా మున్ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని సుంకరి సుభాశ్ ఈ సందర్భంగా​ తెలియజేశారు.

ఇదీ చూడండి: Hero Nikhil: హీరో నిఖిల్‌ కారుకు చలానా విధించిన ట్రాఫిక్‌ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.