యాదాద్రి రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు, స్థలాలు కోల్పోతున్న వారు ఏమాత్రం అధైర్య పడొద్దని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ 2016లో ఇచ్చిన హామీ మేరకు.. ప్రతీ బాధితునికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. 28మంది నిర్వాసితులకు రూ.3కోట్ల విలువ గల.. మంజూరు పత్రాలను అందజేశారు. ప్రతిపక్ష నాయకులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
సుమారు 70మంది బాధితులు.. వారి ఇళ్లు, స్థలాలను ఇవ్వటానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. వారందరికీ మున్సిపాలిటీ పరిధిలోనే స్థలాల కేటాయింపులు జరుపుతామని స్పష్టం చేశారు.