మలి విడత గొర్రెల పంపిణీని వెంటనే చేపట్టాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లాలో గొల్లకుర్మలు నిరసనకు దిగారు. భువనగిరిలోని సమీకృత నూతన కలెక్టరేట్ ఎదుట గొర్రెలను తీసుకొచ్చి ధర్నా నిర్వహించారు.
హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించడంతో ఆ మార్గంతో పాటు యాదాద్రికి రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి నిరసనకారులను అక్కణ్నుంచి తరలించారు.
ఇదీ చదవండి: కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీలో ముగిసిన వాదనలు