ETV Bharat / state

భక్తులతో కిటకిటలాడిన యాదగిరీశుని క్షేత్రం

author img

By

Published : Feb 2, 2020, 2:40 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి ఆదివారం సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారి నిత్య కల్యాణంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

devotees-rush-at-yadadri-temple-on-sunday
భక్తులతో కిటకిటలాడిన యాదగిరీశుని క్షేత్రం

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధికి నేడు ఆదివారం సెలవు దినాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

స్వామి వారి నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణ కట్ట, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిటకిలాడుతున్నాయి. స్వామి వారి ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.

మరోవైపు ఆలయ ఆభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించట్లేదని పోలీసులు పేర్కొన్నారు.

భక్తులతో కిటకిటలాడిన యాదగిరీశుని క్షేత్రం

ఇదీ చదవండిః మందేశాడు... తర్వాత విద్యుత్​ స్తంభంపై చిందేశాడు..!

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధికి నేడు ఆదివారం సెలవు దినాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

స్వామి వారి నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణ కట్ట, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిటకిలాడుతున్నాయి. స్వామి వారి ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.

మరోవైపు ఆలయ ఆభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించట్లేదని పోలీసులు పేర్కొన్నారు.

భక్తులతో కిటకిటలాడిన యాదగిరీశుని క్షేత్రం

ఇదీ చదవండిః మందేశాడు... తర్వాత విద్యుత్​ స్తంభంపై చిందేశాడు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.