యాదాద్రి జిల్లాలో ఫ్రంట్లైన్ వర్కర్స్కు వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా యాదగిరిగుట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి వాక్సిన్ ఇచ్చారు. మొత్తం 100 మందికి లబ్ధిదారులకు ఇవాళ వాక్సిన్ ఇవ్వనున్నట్లు వైద్యులు తెలిపారు.
వాక్సిన్ వేసుకున్నా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డాక్టర్ వంశీకృష్ణ స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ఉపసర్పంచ్ కుటుంబం ఆత్మహత్యాయత్నం