ETV Bharat / state

చౌటుప్పల్​లో ప్రత్యర్థి వర్గంలో చేరిన అధికార పార్టీ కౌన్సిలర్​.. ఎన్నిక వాయిదా - చౌటుప్పల్​ పురపాలికలో ఉద్రిక్తత

అధికార పార్టీకి చెందిన సభ్యురాలు ప్రత్యర్థి వర్గంలో చేరిపోవడం వల్ల యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. ఎక్స్-అఫిషియో సభ్యుడైన ఎమ్మెల్యే... పురపాలిక ఛైర్మన్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎన్నికకు అవకాశం లేనందున ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి... ఛైర్మన్ కూటమి బయటకు వెళ్లిపోయింది. పూర్తి మద్దతుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పట్టుబట్టినా... నిబంధనల మేరకు ఎన్నికను వాయిదా వేయక తప్పలేదు.

co option election postponed in choutuppal due to trs councillor supports to opposition
చౌటుప్పల్​లో ప్రత్యర్థి వర్గంలో చేరిన అధికార పార్టీ కౌన్సిలర్​.. ఎన్నిక వాయిదా
author img

By

Published : Aug 7, 2020, 4:32 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక... రసాభాసగా మారింది. సాఫీగా సాగిపోతుందనుకున్న ఎంపిక ప్రక్రియ... అధికార పార్టీ సభ్యురాలు.. ప్రత్యర్థి వర్గంలో చేరడం ఫలితంగా గొడవకు దారితీసింది.

నలుగురు కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం... 21 మందితో కూడిన పురపాలిక సమావేశమైంది. తెరాస, సీపీఎంకు 11 మంది బలం ఉండగా... కాంగ్రెస్ 5, భాజపా 3, ఒక స్వతంత్రుడు, ఎక్స్-అఫిషియో సభ్యుడైన ఎమ్మెల్యేతో కలిపి ఆ కూటమికి 10 మంది సభ్యుల బలం ఉంది. సమావేశ సమయంలో తెరాస సభ్యురాలు.. ప్రత్యర్థి వర్గంలో చేరికతో గొడవ మొదలైంది. తమ సభ్యురాల్ని వెనక్కి రప్పించేందుకు... ఛైర్మన్ రాజు.. శతథా యత్నించారు. దీనిపై ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఛైర్మన్, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఇరువర్గాల సభ్యులూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగడం వల్ల.. పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. తమకు పూర్తి ఆధిక్యం ఉందని ఎన్నిక కోసం ఎమ్మెల్యే పట్టుబట్టడం... అనైతిక చర్యగా పేర్కొంటూ తెరాస నిరసనకు దిగడంతో గందరగోళం నెలకొంది.

ఇరువర్గాల పంతం నడుమ చౌటుప్పల్ పురపాలక కమిషనర్... ఎటూ తేల్చుకోలేకపోయారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగినందున ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు చెప్పి.. ఛైర్మన్, ఆయన తరఫు సభ్యులు బయటకు వెళ్లిపోయారు. తమకు పూర్తి ఆధిక్యం ఉన్నందున ఎన్నిక వెంటనే జరపాలంటూ... ఎమ్మెల్యే వర్గం పట్టుబట్టింది. అందుకు నిబంధనలు అనుకూలించకపోవడంతో... చివరకు ఎన్నిక వాయిదా పడింది.

చౌటుప్పల్​లో ప్రత్యర్థి వర్గంలో చేరిన అధికార పార్టీ కౌన్సిలర్​.. ఎన్నిక వాయిదా

ఇవీచూడండి: ప్రగతి భవన్​ ముట్టడికి బయలు దేరిన విపక్షనేతల అరెస్ట్​

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక... రసాభాసగా మారింది. సాఫీగా సాగిపోతుందనుకున్న ఎంపిక ప్రక్రియ... అధికార పార్టీ సభ్యురాలు.. ప్రత్యర్థి వర్గంలో చేరడం ఫలితంగా గొడవకు దారితీసింది.

నలుగురు కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం... 21 మందితో కూడిన పురపాలిక సమావేశమైంది. తెరాస, సీపీఎంకు 11 మంది బలం ఉండగా... కాంగ్రెస్ 5, భాజపా 3, ఒక స్వతంత్రుడు, ఎక్స్-అఫిషియో సభ్యుడైన ఎమ్మెల్యేతో కలిపి ఆ కూటమికి 10 మంది సభ్యుల బలం ఉంది. సమావేశ సమయంలో తెరాస సభ్యురాలు.. ప్రత్యర్థి వర్గంలో చేరికతో గొడవ మొదలైంది. తమ సభ్యురాల్ని వెనక్కి రప్పించేందుకు... ఛైర్మన్ రాజు.. శతథా యత్నించారు. దీనిపై ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఛైర్మన్, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఇరువర్గాల సభ్యులూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగడం వల్ల.. పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. తమకు పూర్తి ఆధిక్యం ఉందని ఎన్నిక కోసం ఎమ్మెల్యే పట్టుబట్టడం... అనైతిక చర్యగా పేర్కొంటూ తెరాస నిరసనకు దిగడంతో గందరగోళం నెలకొంది.

ఇరువర్గాల పంతం నడుమ చౌటుప్పల్ పురపాలక కమిషనర్... ఎటూ తేల్చుకోలేకపోయారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగినందున ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు చెప్పి.. ఛైర్మన్, ఆయన తరఫు సభ్యులు బయటకు వెళ్లిపోయారు. తమకు పూర్తి ఆధిక్యం ఉన్నందున ఎన్నిక వెంటనే జరపాలంటూ... ఎమ్మెల్యే వర్గం పట్టుబట్టింది. అందుకు నిబంధనలు అనుకూలించకపోవడంతో... చివరకు ఎన్నిక వాయిదా పడింది.

చౌటుప్పల్​లో ప్రత్యర్థి వర్గంలో చేరిన అధికార పార్టీ కౌన్సిలర్​.. ఎన్నిక వాయిదా

ఇవీచూడండి: ప్రగతి భవన్​ ముట్టడికి బయలు దేరిన విపక్షనేతల అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.