ETV Bharat / state

బస్వాపురం భూ నిర్వాసితుల ధర్నా - Baswapuram Project land expatriates Strike

యాదాద్రి భువనగిరి కలెక్టరేట్​ వద్ద బస్వాపురం భూ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. అనంతరం వరంగల్​ - హైదరాబాద్​ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ఫలితంగా రోడ్డుపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Baswapuram Project land expatriates Strike at Ydadri Bhuvanagiri collectarate
బస్వాపురం భూ నిర్వాసితుల ధర్నా
author img

By

Published : Jul 14, 2020, 12:01 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బీఎన్​ తిమ్మాపూర్​ గ్రామస్థులు కలెక్టరేట్​ ముందు ఆందోళన చేపట్టారు. పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్​ చేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అడ్డుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ​కాసేపు కలెక్టరేట్​ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

అనంతరం వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి.. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భువనగిరి ఏసీపీ భుజంగరావు, అధికారులు నిర్వాసితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అదనపు కలెక్టర్​ ఖీమా నాయక్​ నిర్వాసితులు వినతిపత్రం సమర్పించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బీఎన్​ తిమ్మాపూర్​ గ్రామస్థులు కలెక్టరేట్​ ముందు ఆందోళన చేపట్టారు. పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్​ చేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అడ్డుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ​కాసేపు కలెక్టరేట్​ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

అనంతరం వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి.. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భువనగిరి ఏసీపీ భుజంగరావు, అధికారులు నిర్వాసితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అదనపు కలెక్టర్​ ఖీమా నాయక్​ నిర్వాసితులు వినతిపత్రం సమర్పించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.