ETV Bharat / state

యాదాద్రీశుడి కల్యాణానికి ఇంకా కొన్నిరోజులే.. - తెలంగాణ తాజా వార్తలు

విశ్వశాంతి కాంక్షిస్తూ ఏటా జరగుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఇంకా 50 రోజులే మిగిలాయి. పదకొండు రోజులపాటు కొనసాగే ఈ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పంచ నారసింహుల ప్రధానాలయంలోనే ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను జరిపించాలని సీఎం కేసీఆర్ యోచన.

యాదాద్రీశుడు కల్యాణానికి ఇంకా కొన్ని రోజులే..
యాదాద్రీశుడు కల్యాణానికి ఇంకా కొన్ని రోజులే..
author img

By

Published : Jan 24, 2021, 11:12 AM IST

రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా మార్చి నెల 15 నుంచి మొదలైన వేడుకలు పదకొండు రోజులు జరుగుతాయి. ఆలయ విస్తరణ పనుల వల్ల బ్రహ్మోత్సవాలను 2017 నుంచి వరుసగా నాలుగు సార్లు బాలాలయంలో నిర్వహించారు. ప్రస్తుతం ప్రధానాలయంతో పాటు అనుబంధ శివాలయం పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కొండపై చేపట్టిన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు.

నాలుగేళ్లుగా బాలాలయానికే పరిమితమైన స్వామివారి ఉత్సవాలను ఈఏడాది కూడా స్వయంభువుల చెంతనే నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం​ ఉన్నట్లు తెలుస్తోంది. కొండపై జరుగుతున్న పనుల ప్రగతిని సీఎంఓ భూపాల్ రెడ్డి పరిశీలించి నివేదికను సీఎం కేసీఆర్​కు సమర్పించనున్నారు. దాని ఆధారంగా సీఎం యాదాద్రికి వచ్చే అవకాశం ఉంది. మార్చి రెండో వారంలో ఉత్సవాలు ప్రారంభం కాగా... 22న స్వామివారి కల్యాణం జరగనుంది. ఈసారి ఉత్సవాలను సంప్రదాయ హంగులతో నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా మార్చి నెల 15 నుంచి మొదలైన వేడుకలు పదకొండు రోజులు జరుగుతాయి. ఆలయ విస్తరణ పనుల వల్ల బ్రహ్మోత్సవాలను 2017 నుంచి వరుసగా నాలుగు సార్లు బాలాలయంలో నిర్వహించారు. ప్రస్తుతం ప్రధానాలయంతో పాటు అనుబంధ శివాలయం పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కొండపై చేపట్టిన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు.

నాలుగేళ్లుగా బాలాలయానికే పరిమితమైన స్వామివారి ఉత్సవాలను ఈఏడాది కూడా స్వయంభువుల చెంతనే నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం​ ఉన్నట్లు తెలుస్తోంది. కొండపై జరుగుతున్న పనుల ప్రగతిని సీఎంఓ భూపాల్ రెడ్డి పరిశీలించి నివేదికను సీఎం కేసీఆర్​కు సమర్పించనున్నారు. దాని ఆధారంగా సీఎం యాదాద్రికి వచ్చే అవకాశం ఉంది. మార్చి రెండో వారంలో ఉత్సవాలు ప్రారంభం కాగా... 22న స్వామివారి కల్యాణం జరగనుంది. ఈసారి ఉత్సవాలను సంప్రదాయ హంగులతో నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: తపాలా శాఖతో 'హస్తకళ'కు ప్రత్యేక గుర్తింపు: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.