ETV Bharat / state

లక్ష్మీనరసింహ స్వామికి పంచామృతాలతో అభిషేకం - యాదాద్రి భువనగిరి జిల్లా లేటెస్ట్​ వార్తలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఏకాంత సేవలో లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు.

లక్ష్మీనరసింహ స్వామికి పంచామృతాలతో అభిషేకం
లక్ష్మీనరసింహ స్వామికి పంచామృతాలతో అభిషేకం
author img

By

Published : May 16, 2021, 4:41 PM IST

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి ఆదివారం పంచామృతాలతో అభిషేకం చేశారు. వేకువజామున సుప్రభాత సేవ నిర్వహించిన అర్చకులు పంచనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయంలో సుదర్శన ఆళ్వారును కొలుస్తూ సుదర్శన నారసింహ హోమం జరిపారు.

అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్యతిరు కల్యాణ మహోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఏకాంత సేవలో లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. కల్యాణం అనంతరం దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు.

ఇదీ చదవండి: బేగంపేట వద్ద ఎంపీ రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి ఆదివారం పంచామృతాలతో అభిషేకం చేశారు. వేకువజామున సుప్రభాత సేవ నిర్వహించిన అర్చకులు పంచనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయంలో సుదర్శన ఆళ్వారును కొలుస్తూ సుదర్శన నారసింహ హోమం జరిపారు.

అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్యతిరు కల్యాణ మహోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఏకాంత సేవలో లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. కల్యాణం అనంతరం దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు.

ఇదీ చదవండి: బేగంపేట వద్ద ఎంపీ రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.