ETV Bharat / state

'అధికారులు నా భూమిని లాక్కోవాలని చూస్తున్నారు' - భూమిన అధికారులు లాక్కుంటున్నారంటూ రైతు ఫిర్యాదు

తన భూమిని ప్రభుత్వ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నించడమే కాకుండా... పంటను ధ్వసం చేశారని ఓ వ్యక్తి మానవహక్కుల కమిషన్​ను ఆశ్రయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించాడు.

farmar complained to HRC
'అధికారులు నా భూమిని బలవంతంగా లాక్కుంటున్నారు'
author img

By

Published : Jul 7, 2020, 4:31 PM IST

ప్రభుత్వం గతంలో తనకు ఇచ్చిన భూమిని అధికారులు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఓ రైతు హెచ్​ఆర్​సీని ఆశ్రయించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మూట కొండూరుకు చెందిన బండి నర్సయ్య... 40 ఏళ్ల క్రితం తనకు నాలుగు ఎకరాల 33 కుంటల భూమిని ప్రభుత్వం ఇచ్చిందని కమిషన్​కు తెలిపాడు. ఆ భూమిలో నూతనంగా పోలీస్​ స్టేషన్​ నిర్మించేందుకు యత్నిస్తున్నాడని వాపోయాడు.

భూమి ఇవ్వాలని స్థానిక తహసీల్దారు, ఆర్ఐ, వీఆర్వో తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించాడు. న్యాయం కోసం మూట కొండూర్ పోలీసు స్టేషన్​కు వెళ్తే... పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశాడు. తన ఫిర్యాదును పరిశీలించి న్యాయం చేయాలని హెచ్​ఆర్​సీని కోరాడు.

ప్రభుత్వం గతంలో తనకు ఇచ్చిన భూమిని అధికారులు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఓ రైతు హెచ్​ఆర్​సీని ఆశ్రయించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మూట కొండూరుకు చెందిన బండి నర్సయ్య... 40 ఏళ్ల క్రితం తనకు నాలుగు ఎకరాల 33 కుంటల భూమిని ప్రభుత్వం ఇచ్చిందని కమిషన్​కు తెలిపాడు. ఆ భూమిలో నూతనంగా పోలీస్​ స్టేషన్​ నిర్మించేందుకు యత్నిస్తున్నాడని వాపోయాడు.

భూమి ఇవ్వాలని స్థానిక తహసీల్దారు, ఆర్ఐ, వీఆర్వో తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించాడు. న్యాయం కోసం మూట కొండూర్ పోలీసు స్టేషన్​కు వెళ్తే... పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశాడు. తన ఫిర్యాదును పరిశీలించి న్యాయం చేయాలని హెచ్​ఆర్​సీని కోరాడు.

ఇవీ చూడండి: కొనసాగుతున్న సచివాలయ భవనాల కూల్చివేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.