ETV Bharat / state

రోగ నిరోధక శక్తిపై ప్రజలకు అవగాహన కల్పించాలి - రోగ నిరోధక శక్తిపై ప్రజలకు అవగాహన కల్పించాలి

కొవిడ్ -19కు ప్రభావితం కాకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ కోరారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడం నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

Warangal urban collector Rajiv gandhi review meeting on corona virus
రోగ నిరోధక శక్తిపై ప్రజలకు అవగాహన కల్పించాలి
author img

By

Published : Jun 9, 2020, 11:04 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లాలో కరోనా వైరస్​ వ్యాప్తిపై పాలనాధికారి రాజీవ్​ గాంధీ కలెక్టరేట్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారి వివరాలను ప్రైవేట్​ ఆసుపత్రులకు తెలియజేసేందుకు ఒక సీనియర్​ వైద్యుడిని నోడల్​ అధికారిగా నియమించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.

ప్రైవేట్​ ఆసుపత్రుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా నియమ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు రోగ నిరోధక శక్తి పెంపొందించే చర్యలపై తరచుగా అవగాహన కల్పించాలని కోరారు. హోంకార్వంటైన్​లో ఉన్న వ్యక్తిని పారమెడికల్​ సిబ్బంది రోజుకు రెండు సార్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

వరంగల్​ అర్బన్​ జిల్లాలో కరోనా వైరస్​ వ్యాప్తిపై పాలనాధికారి రాజీవ్​ గాంధీ కలెక్టరేట్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారి వివరాలను ప్రైవేట్​ ఆసుపత్రులకు తెలియజేసేందుకు ఒక సీనియర్​ వైద్యుడిని నోడల్​ అధికారిగా నియమించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.

ప్రైవేట్​ ఆసుపత్రుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా నియమ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు రోగ నిరోధక శక్తి పెంపొందించే చర్యలపై తరచుగా అవగాహన కల్పించాలని కోరారు. హోంకార్వంటైన్​లో ఉన్న వ్యక్తిని పారమెడికల్​ సిబ్బంది రోజుకు రెండు సార్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.