ETV Bharat / state

పీఎం కేర్స్​కు నిట్ విద్యార్థుల భారీ విరాళం - నిట్ విద్యార్థుల విరాళం

కొవిడ్​పై పోరాటానికి తమ వంతు సాయంగా ఒక వారం మెస్​ ఛార్జీలను ప్రధాన మంత్రి సహాయనిధికి వరంగల్ నిట్ విద్యార్థులు అందించారు. మొత్తం 23 లక్షల 76 వేల 840రూపాయలను అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

warangal-nit-students-contribution-to-pm-cares-fund
పీఎం కేర్స్ సహాయనిధికి భారీగా విరాళమిచ్చిన నిట్ విద్యార్థులు
author img

By

Published : May 13, 2020, 5:30 PM IST

వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్ విద్యార్థులు ప్రధానమంత్రి సహాయ నిధికి 23లక్షల 76వేల 840రూపాయల విరాళాలు అందిస్తున్నట్లు ప్రకటించారు. కొవిడ్-19పై పోరాటానికి తమవంతు మద్దతుగా 4000 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా... వారి ఒక వారం మెస్ ఛార్జీలను అందజేస్తున్నట్లు నిట్ యాజమాన్యం పేర్కొన్నారు.

గతనెలలో సుమారు 20 లక్షల రూపాయలతో పాటు... పూర్వ విద్యార్థులు 6 లక్షలకు పైగా విరాళాలను అందించారు. తాజాగా విద్యార్థులు ఇవ్వనున్న విరాళాలతో వరంగల్ నిట్ నుంచి ప్రధానిమంత్రి సహాయ నిధికి ప్రకటించిన విరాళాలు మొత్తం 50 లక్షల రూపాయలకు చేరుకున్నాయి. విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరిని నిట్ సంచాలకుడు ఎన్వీ రమణా రావు అభినందించారు.

వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్ విద్యార్థులు ప్రధానమంత్రి సహాయ నిధికి 23లక్షల 76వేల 840రూపాయల విరాళాలు అందిస్తున్నట్లు ప్రకటించారు. కొవిడ్-19పై పోరాటానికి తమవంతు మద్దతుగా 4000 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా... వారి ఒక వారం మెస్ ఛార్జీలను అందజేస్తున్నట్లు నిట్ యాజమాన్యం పేర్కొన్నారు.

గతనెలలో సుమారు 20 లక్షల రూపాయలతో పాటు... పూర్వ విద్యార్థులు 6 లక్షలకు పైగా విరాళాలను అందించారు. తాజాగా విద్యార్థులు ఇవ్వనున్న విరాళాలతో వరంగల్ నిట్ నుంచి ప్రధానిమంత్రి సహాయ నిధికి ప్రకటించిన విరాళాలు మొత్తం 50 లక్షల రూపాయలకు చేరుకున్నాయి. విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరిని నిట్ సంచాలకుడు ఎన్వీ రమణా రావు అభినందించారు.

ఇవీ చూడండి: ఆసుపత్రికి వెళ్లాలంటే.. డోలీ ఎక్కాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.