ETV Bharat / state

'కుడా' పట్టణాభివృద్ధిలో మార్గదర్శిగా నిలుస్తుంది : కుడా ఛైర్మన్​

author img

By

Published : Sep 5, 2020, 9:49 PM IST

రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి కాకతీయ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (కుడా) మార్గదర్శిగా నిలుస్తుందని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ మర్రి యాదవ రెడ్డి అన్నారు. స్టడీ టూర్​లో భాగంగా పలు నగరాల ఛైర్మన్లు వరంగల్​ పట్టణాన్ని సందర్శించారు. కుడా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇతర నగరాభివృద్ధికి ప్రేరణనిచ్చేలా ఉన్నాయని కితాబిచ్చారు.

urban development authority chairmans study tour  in warangal
'కుడా' పట్టణాభివృద్ధిలో మార్గదర్శిగా నిలుస్తుంది : కుడా ఛైర్మన్​

వరంగల్​ అర్బన్​ జిల్లాలోని పట్టణ ప్రాంత అభివృద్ధి రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుందని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ మర్రి యాదవరెడ్డి అన్నారు. స్టడీ టూర్​లో భాగంగా వరంగల్​ నగరాన్ని సందర్శించిన కరీంనగర్​, నిజామాబాద్​, సిద్ధిపేట, ఖమ్మం పట్టణాభివృద్ధి ఛైర్మన్లకు ఆయన వరంగల్​ పట్టణంలోని పలు ప్రాంతాలు తిప్పి చూపించారు. కుడా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా వివరించారు. వరంగల్​ పట్టణంలోని పోతన జంక్షన్​, ఓ సిటీ, భద్రకాళి బండ్​ తదితర ప్రాంతాలను పట్టణాభివృద్ధి సంస్థల ఛైర్మన్లకు చూపించారు.

పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఈ అధ్యయన యాత్ర మాకు ఎంతో ఉపయోగ పడనుందని పట్టణాభివృద్ధి సంస్థల ఛైర్మన్లు అన్నారు. తమ పట్టణాల్లో కూడా త్వరలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వరంగల్​ పట్టణంలా.. నిజామాబాద్​, కరీంనగర్, సిద్ధిపేట, ఖమ్మం పట్టణాలను తీర్చి దిద్దుతామని తెలిపారు. చారిత్రాత్మక వరంగల్​ నగరాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దడమే లక్ష్యమని కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి అన్నారు. ఈ అధ్యయన యాత్రలో శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ రామకృష్ణారావు, నిజామాబాద్​ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ప్రభాకర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్​ అర్బన్​ జిల్లాలోని పట్టణ ప్రాంత అభివృద్ధి రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుందని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ మర్రి యాదవరెడ్డి అన్నారు. స్టడీ టూర్​లో భాగంగా వరంగల్​ నగరాన్ని సందర్శించిన కరీంనగర్​, నిజామాబాద్​, సిద్ధిపేట, ఖమ్మం పట్టణాభివృద్ధి ఛైర్మన్లకు ఆయన వరంగల్​ పట్టణంలోని పలు ప్రాంతాలు తిప్పి చూపించారు. కుడా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా వివరించారు. వరంగల్​ పట్టణంలోని పోతన జంక్షన్​, ఓ సిటీ, భద్రకాళి బండ్​ తదితర ప్రాంతాలను పట్టణాభివృద్ధి సంస్థల ఛైర్మన్లకు చూపించారు.

పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఈ అధ్యయన యాత్ర మాకు ఎంతో ఉపయోగ పడనుందని పట్టణాభివృద్ధి సంస్థల ఛైర్మన్లు అన్నారు. తమ పట్టణాల్లో కూడా త్వరలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వరంగల్​ పట్టణంలా.. నిజామాబాద్​, కరీంనగర్, సిద్ధిపేట, ఖమ్మం పట్టణాలను తీర్చి దిద్దుతామని తెలిపారు. చారిత్రాత్మక వరంగల్​ నగరాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దడమే లక్ష్యమని కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి అన్నారు. ఈ అధ్యయన యాత్రలో శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ రామకృష్ణారావు, నిజామాబాద్​ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ప్రభాకర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.