వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్లో స్వామి వివేకానంద యువజనోత్సవాలు ప్రారంభమయ్యాయి. వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ సంచాలకుడు స్వామి బోధమయానంద, వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వామి వివేకానంద బోధనలు సమాజ అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడుతున్నాయని స్వామి బోధమయానంద తెలిపారు.
దేశానికి యువత వెన్నెముక వంటిదని... అటువంటి యువత సత్ప్రవర్తనతో నడవడం ద్వారానే మంచి సమాజం నిర్మితమవుతుందని తెలిపారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి: ఉద్రిక్తత.. హత్య కేసులో నిందితుడి ఇంటికి నిప్పు