వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆరో రోజు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. విధులు బహిష్కరించడం వల్ల అధికారులు తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లతో బస్సులను నడిపిస్తున్నారు. దసరా పండుగ ముగించుకొని వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా హన్మకొండ బస్టాండ్ నుంచి అధికారులు అధిక సంఖ్యలో బస్సులు వేశారు. ముఖ్యంగా హైదరాబాద్కు ఎక్కువ సంఖ్యలో బస్సులను తిప్పుతున్నారు. వరంగల్ రీజియన్లో ఆర్టీసీకి సమ్మె వల్ల 5 రోజుల్లో 4 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: ఉద్యోగం పోయిందనే మనస్థాపంతో ఆర్టీసీ డ్రైవర్ మృతి!