ETV Bharat / state

వరంగల్‌లో మధ్యాహ్నం 1 వరకు 37.98 శాతం పోలింగ్ - People wearing masks and voting

వరంగల్‌ కార్పొరేషన్‌లో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. వరంగల్‌లో 66 డివిజన్లలో 500 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వరంగల్‌లో మధ్యాహ్నం 1 వరకు 37.98 శాతం పోలింగ్ నమోదైంది.

wearing masks and voting at warangal corporation, warangal corporation election news today
వరంగల్‌లో మధ్యాహ్నం 1 వరకు 37.98 శాతం పోలింగ్
author img

By

Published : Apr 30, 2021, 8:41 AM IST

Updated : Apr 30, 2021, 2:21 PM IST

వరంగల్‌ కార్పొరేషన్‌లో పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొవిడ్​ నిబంధనల నడుమ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వరంగల్‌ కార్పొరేషన్‌లో 66 డివిజన్లకు సంబంధించి 878 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6 లక్షల 63,240 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 66 డివిజన్లలో 500 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వరంగల్‌లో మధ్యాహ్నం 1 వరకు 37.98 శాతం ఓటింగ్​ నమోదైంది.

Exact social distance of voters
సామజిక దూరం పాటిస్తున్న ఓటర్లు

46 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ క్యాస్టింగ్ చేస్తుండగా.. 561 కేంద్రాల్లో సీసీటీవీల ద్వారా పోలింగ్‌ను రికార్డు చేస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Elderly people coming in charge of polling stations
పోలింగ్​ కేంద్రాలకు బాధ్యతగా వస్తున్న వృద్ధులు

మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు పలువురు ప్రముఖులు, యువతీ యువకులు కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ ఓటు వేశారు.

Former Deputy Chief Minister Kadiyam Srihari exercised his right to vote
ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

ఇదీ చూడండి : లైవ్​ అప్​డేట్స్​: రాష్ట్రంలో కొనసాగుతున్న మినీ పుర పోరు పోలింగ్

వరంగల్‌ కార్పొరేషన్‌లో పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొవిడ్​ నిబంధనల నడుమ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వరంగల్‌ కార్పొరేషన్‌లో 66 డివిజన్లకు సంబంధించి 878 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6 లక్షల 63,240 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 66 డివిజన్లలో 500 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వరంగల్‌లో మధ్యాహ్నం 1 వరకు 37.98 శాతం ఓటింగ్​ నమోదైంది.

Exact social distance of voters
సామజిక దూరం పాటిస్తున్న ఓటర్లు

46 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ క్యాస్టింగ్ చేస్తుండగా.. 561 కేంద్రాల్లో సీసీటీవీల ద్వారా పోలింగ్‌ను రికార్డు చేస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Elderly people coming in charge of polling stations
పోలింగ్​ కేంద్రాలకు బాధ్యతగా వస్తున్న వృద్ధులు

మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు పలువురు ప్రముఖులు, యువతీ యువకులు కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ ఓటు వేశారు.

Former Deputy Chief Minister Kadiyam Srihari exercised his right to vote
ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

ఇదీ చూడండి : లైవ్​ అప్​డేట్స్​: రాష్ట్రంలో కొనసాగుతున్న మినీ పుర పోరు పోలింగ్

Last Updated : Apr 30, 2021, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.