వరంగల్లో సామాజిక బాధ్యతపై ఎన్సీసీ విద్యార్థుల అవగాహన ర్యాలీ వరంగల్ నగరంలో సామాజిక అవగాహనపై ఎన్సీసీ విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. హన్మకొండలోని హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు జరిగిన ర్యాలీలో ప్రజలకు అవగాహన కల్పించారు. క్లీన్ వరంగల్, క్లీన్ తెలంగాణ, గ్రీన్ ఇండియా అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎన్సీసీ బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగం వద్దని... నీటి వినియోగం, బాలిక సంరక్షణ, మొక్కల పెంపకం మొదలైన అంశాలపై కూడా అవగాహన కల్పించారు.ఇవీ చూడండి:కార్తీక్ రెడ్డికి చేవెళ్ల టికెట్?