ETV Bharat / state

నిరాడంబరంగా గణనాథుని నిమజ్జనం - హన్మకొండలో గణేశ్​ నిమజ్జనం వార్తలు

హన్మకొండలో నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రతిఏటా ఎంతో ఘనంగా జరిగే నిమజ్జనోత్సవాలు.. కొవిడ్​ కారణంగా ఈసారి నిరాడంబరంగా నిర్వహించారు.

Navratri festivities ending peacefully at Hanmakonda
హన్మకొండలో ప్రశాంతంగా ముగిసిన నవరాత్రి ఉత్సవాలు
author img

By

Published : Aug 31, 2020, 12:21 PM IST

హన్మకొండలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. కరోనా దృష్ట్యా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నగర వాసులు శోభాయాత్రను నిర్వహించారు.

జిల్లాలో కొవిడ్​ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఈసారి ఇళ్లలోనే వినాయకులను ప్రతిష్టించుకున్నారు. ఈ మేరకు హన్మకొండలోని పద్మాక్షి గుండం, సిద్ధేశ్వర గుండాలలో నిమజ్జనం చేశారు. గణనాథులను కడసారి చూసేందుకు జనం ఆసక్తి కనబరిచారు.

మరోవైపు నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Navratri festivities ending peacefully at Hanmakonda
పద్మాక్షి గుండంలో గణేశ్​ నిమజ్జనం

ఇదీచూడండి.. వినాయక నిమజ్జనాలతో సందడిగా మారిన ట్యాంక్​బండ్

హన్మకొండలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. కరోనా దృష్ట్యా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నగర వాసులు శోభాయాత్రను నిర్వహించారు.

జిల్లాలో కొవిడ్​ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఈసారి ఇళ్లలోనే వినాయకులను ప్రతిష్టించుకున్నారు. ఈ మేరకు హన్మకొండలోని పద్మాక్షి గుండం, సిద్ధేశ్వర గుండాలలో నిమజ్జనం చేశారు. గణనాథులను కడసారి చూసేందుకు జనం ఆసక్తి కనబరిచారు.

మరోవైపు నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Navratri festivities ending peacefully at Hanmakonda
పద్మాక్షి గుండంలో గణేశ్​ నిమజ్జనం

ఇదీచూడండి.. వినాయక నిమజ్జనాలతో సందడిగా మారిన ట్యాంక్​బండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.