వరంగల్ భద్రకాళి దేవస్థానంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో పాటు పసుపు, కుంకుమతో ఉదయం అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారు సరస్వతి దేవీ అలంకరణలో దర్శనమిచ్చారు.
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.6లక్షలు విలువ చేసే కంఠాభరణాలు సమర్పించారు. ఎమ్మెల్సీతో పాటు వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
![navaratri celebrations at bhadrakali temple in warangal by mlc pochampally srinivas reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9281223_381_9281223_1603434105050.png)
ఇదీ చదవండి: శ్రీ భద్రకాళి ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు