వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి తండాలో గిరిజన తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గిరిజన మహిళలు, యువకులు వారికి ఘనస్వాగతం పలికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పండుగలు సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ప్రభుత్వం అన్ని కులాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అనంతరం గోధుమ బుట్టలు ఎత్తుకొని మహిళలతో కలిసి నృత్యాలు చేశారు.
ఇదీ చూడండి :'అటవీ పునరుద్ధరణకై... అందరూ నడుంబిగించండి'