ETV Bharat / state

నష్టపోయిన వారిని కచ్చితంగా ఆదుకుంటాం: ఎమ్మెల్యే

author img

By

Published : May 19, 2020, 1:29 PM IST

సోమవారం రాత్రి వరంగల్​ పట్టణ జిల్లా భీమారంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఇళ్లు, ఫంక్షన్​హాల్​, చెట్లు కూలిపోయాయి. ఎమ్మెల్యే అరూరి రమేష్​ గ్రామాన్ని సందర్శించి.. నష్టపోయిన వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

mla visit damage houses
mla visit damage houses

ఈదురుగాలులు, అకాల వర్షంతో నష్టపోయిన వారిని కచ్చితంగా ప్రభుత్వపరంగా ఆదుకుంటామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. సోమవారం రాత్రి వరంగల్​ పట్టణ జిల్లా హసన్​పర్తి మండలం భీమారంలో గాలివాన భీభత్సం సృష్టించింది. పలు ఇళ్లు, ఫంక్షన్ హల్, చెట్లు కూలిపోయాయి. సుమారు కోటి రూపాయల ఆస్తినష్టం జరుగగా.. ఓ వ్యక్తి చనిపోయాడు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేష్ అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. కూలిపోయిన ఇళ్లను, ధ్వంసమైన ఫంక్షన్ హాల్​ను పరిశీలించారు. అకాల వర్షంతో నష్టపోయిన వారిని కచ్చితంగా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈదురుగాలులు, అకాల వర్షంతో నష్టపోయిన వారిని కచ్చితంగా ప్రభుత్వపరంగా ఆదుకుంటామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. సోమవారం రాత్రి వరంగల్​ పట్టణ జిల్లా హసన్​పర్తి మండలం భీమారంలో గాలివాన భీభత్సం సృష్టించింది. పలు ఇళ్లు, ఫంక్షన్ హల్, చెట్లు కూలిపోయాయి. సుమారు కోటి రూపాయల ఆస్తినష్టం జరుగగా.. ఓ వ్యక్తి చనిపోయాడు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేష్ అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. కూలిపోయిన ఇళ్లను, ధ్వంసమైన ఫంక్షన్ హాల్​ను పరిశీలించారు. అకాల వర్షంతో నష్టపోయిన వారిని కచ్చితంగా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: నగరంలో దుకాణాలు తెరుచుకున్నాయ్​.. అతిక్రమిస్తే అంతే ఇక!


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.