వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా పాజిటవ్ వ్యక్తులంతా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడం శుభపరిణామమని గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. జిల్లాలో అందరి సమష్ఠి కృషి ఫలితమే ఈ విజయమని ఆమె కొనియాడారు.
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని నందనాగార్డెన్స్లో అధికారులతో సమావేశమైన మంత్రి సత్యవతి కొవిడ్ నియంత్రణ చర్యలు, తాగునీటి సరఫరా, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై సమీక్షించారు.
జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గినా ప్రమాదం ఇంకా పొంచే ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.
ఇవీ చూడండి: తెల్లారిన బతుకులు..రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి