ETV Bharat / state

తెలంగాణ నెక్ట్స్ సీఎం కేటీఆర్.. మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

author img

By

Published : Mar 7, 2023, 10:58 AM IST

Errabelli Comment's on Telangana Next CM: రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్​ తర్వాత అంతటి సమర్థవంతమైన నాయకుడు కేటీఆరే అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Minister Errabelli
మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు
తెలంగాణ నెక్ట్స్ సీఎం కేటీఆర్

Errabelli Comment's on Telangana Next CM: తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్​ ఆధ్వర్యంలో రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందని.. ఇండస్ట్రీస్, ఐటీ సంస్థలు ఎన్నో వచ్చాయని తెలిపారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో నిర్వహించబోయే బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్​ హాజరవుతారని.. సభ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్​ తర్వాత కేటీఆరే అంతటి సమర్థవంతమైన నాయకుడని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆరే అని స్పష్టం చేశారు.​ అయితే ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

"కేటీఆర్​ కాబోయే ముఖ్యమంత్రి. సబ్జెట్​ ఉన్న వ్యక్తి కాబట్టే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. కేటీఆర్​ నాయకత్వంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. నిరుద్యోగ యువకులకు కూడా చాలా ప్రోత్సాహకాలు అందుతున్నాయి. వరంగల్​లో కూడా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు రావడం వారి ప్రోత్సాహకంతోనే జరుగుతున్నాయి."-ఎర్రబెల్లి దయాకర్​ రావు, పంచాయతీరాజ్​ శాఖ మంత్రి

Women's Day Celebrations In Warangal: మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్​ వరంగల్​ రానున్న సందర్భంగా సభా ప్రాంగణంలో హెలీ ప్యాడ్​, సభా స్థలం, పార్కింగ్​ స్థలంతో పాటు ఇతర ఏర్పాట్లను పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​ కుమార్​ సోమవారం పరిశీలించారు. ప్రతిమ క్యాన్సర్​ ఇన్​స్టిట్యూట్​ ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్​ స్క్రీనింగ్​ శిబిరాన్ని మంత్రి కేటీఆర్​ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభిస్తారని తెలిపారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని.. ఈ సేవలను వినియోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మహిళా దినోత్సవ కార్యక్రమాలు: రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలను పురపాలక శాఖ నిర్వహించి.. పలువురిని సత్కరించనున్నారు. మహిళలకు క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వారి ఆరోగ్యం గురించి హెల్త్​ క్యాంపులు నిర్వహించనున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న, అత్యుత్తమ ప్రదర్శన చేసిన మహిళలను సన్మానించనున్నారు.

ఇవీ చదవండి:

తెలంగాణ నెక్ట్స్ సీఎం కేటీఆర్

Errabelli Comment's on Telangana Next CM: తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్​ ఆధ్వర్యంలో రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందని.. ఇండస్ట్రీస్, ఐటీ సంస్థలు ఎన్నో వచ్చాయని తెలిపారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో నిర్వహించబోయే బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్​ హాజరవుతారని.. సభ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్​ తర్వాత కేటీఆరే అంతటి సమర్థవంతమైన నాయకుడని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆరే అని స్పష్టం చేశారు.​ అయితే ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

"కేటీఆర్​ కాబోయే ముఖ్యమంత్రి. సబ్జెట్​ ఉన్న వ్యక్తి కాబట్టే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. కేటీఆర్​ నాయకత్వంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. నిరుద్యోగ యువకులకు కూడా చాలా ప్రోత్సాహకాలు అందుతున్నాయి. వరంగల్​లో కూడా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు రావడం వారి ప్రోత్సాహకంతోనే జరుగుతున్నాయి."-ఎర్రబెల్లి దయాకర్​ రావు, పంచాయతీరాజ్​ శాఖ మంత్రి

Women's Day Celebrations In Warangal: మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్​ వరంగల్​ రానున్న సందర్భంగా సభా ప్రాంగణంలో హెలీ ప్యాడ్​, సభా స్థలం, పార్కింగ్​ స్థలంతో పాటు ఇతర ఏర్పాట్లను పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​ కుమార్​ సోమవారం పరిశీలించారు. ప్రతిమ క్యాన్సర్​ ఇన్​స్టిట్యూట్​ ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్​ స్క్రీనింగ్​ శిబిరాన్ని మంత్రి కేటీఆర్​ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభిస్తారని తెలిపారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని.. ఈ సేవలను వినియోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మహిళా దినోత్సవ కార్యక్రమాలు: రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలను పురపాలక శాఖ నిర్వహించి.. పలువురిని సత్కరించనున్నారు. మహిళలకు క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వారి ఆరోగ్యం గురించి హెల్త్​ క్యాంపులు నిర్వహించనున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న, అత్యుత్తమ ప్రదర్శన చేసిన మహిళలను సన్మానించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.