ETV Bharat / state

రాష్ట్ర అభివృద్ధికి భాజపా పైసా ఇవ్వలేదు: ఎర్రబెల్లి

author img

By

Published : Apr 25, 2021, 7:01 AM IST

వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందడిగా సాగుతోంది. గెలుపు కోసం కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. నగరంలోని పలు డివిజన్లలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించి... తెరాస చేసిన అభివృద్ధిని వివరించారు.

minister errabelli dayakar rao election campaign, warangal elections
ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ మున్సిపల్ ఎన్నికలు

భాజపాకు ఓటేస్తే ఒరిగేదేమిలేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా... రాష్ట్ర అభివృద్ధికి పైసా ఇవ్వలేదని ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెరాస అభ్యర్థుల తరఫున మంత్రి ప్రచారం చేశారు.

గడిచిన ఏడేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని కోరారు. ప్రతిపక్షాలకు డిపాజిట్ దక్కదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ దయాకర్​ పాల్గొన్నారు.

భాజపాకు ఓటేస్తే ఒరిగేదేమిలేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా... రాష్ట్ర అభివృద్ధికి పైసా ఇవ్వలేదని ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెరాస అభ్యర్థుల తరఫున మంత్రి ప్రచారం చేశారు.

గడిచిన ఏడేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని కోరారు. ప్రతిపక్షాలకు డిపాజిట్ దక్కదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ దయాకర్​ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పేదల సంక్షేమమే తెరాస లక్ష్యం: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.