ETV Bharat / state

ఐదు రోజులు మృత్యువుతో పోరాడి.. ఓడిన మెడికో ప్రీతి!

PG Medical student Preethi Died: ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన కాకతీయ మెడికల్‌ కళాశాల వైద్య విద్యార్థిని ప్రీతి... హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెను బతికించేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. తెలివి తేటలు, ధైర్యం, ప్రశ్నించే తెగువ ఉన్న ప్రీతి చివరకు ఓ సీనియర్ వేధింపులు తాళలేక ప్రాణాలు కోల్పోయింది. అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని... అర్ధాంతరంగా తనువు చాలించింది. తగ్గని సైఫ్ వేధింపులు.. తేలిగ్గా తీసుకున్న కళాశాల బాధ్యులు, కారణాలేవైనా యువ వైద్యురాలు చనిపోయి.. తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగల్చింది.

author img

By

Published : Feb 27, 2023, 7:19 AM IST

PG Medical student Preethi died
PG Medical student Preethi died
ప్రీతిని బతికించేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నినా.. ఫలితం దక్కలేదు..!

PG Medical student Preethi Died: నిత్యం నవ్వతూ చలాకీగా ఉండే పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి... 26 ఏళ్లకే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన విద్యా కుసుమం... అర్థాంతరంగా అందరికీ దూరమైంది. పరిస్ధితి అత్యంత విషమమని వైద్యులు ఎప్పటికప్పుడు చెబుతున్నా ఎక్కడో ఓ చిన్న ఆశ. ఆమె మృత్యుముఖం నుంచి బయటకు వస్తుందని, రావాలని అంతా ఆశించారు.

కన్నబిడ్డలాగే భావించి, క్షేమంగా తిరిగిరావాలని ప్రార్ధించారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ప్రీతి ఇక సెలవంటూ... శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. కన్నవారు, తోబుట్టువులకు, ఇతర కుటుంబసభ్యులకు.. తోటి విద్యార్ధులకు తీరని వేదనని మిగిల్చింది. ధరావత్ ప్రీతి కాకతీయ వైద్య కళాశాలలో అనస్తీషియా పీజీ మొదటి సంవత్సరం విద్యార్ధిని.

Kakatiya Medical College Preethi Died: స్వస్ధలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి శివారు గిర్నితండా. తండ్రి ధరావత్ నరేందర్ హైదరాబాద్‌లో ఆర్పీఎఫ్​లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. హాస్టల్‌లో ఉంటూ వైద్యవిద్యను అభ్యసిస్తున్న ప్రీతి పట్ల సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ మొదటి నుంచి కోపాన్ని ప్రదర్శించేవాడని తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో కళాశాలలో చేరిన నాటి నుంచి నిందితుడు సైఫ్‌తో రోజూ ఇబ్బందులే.

డిసెంబర్ 6న రోగికి అవసరమైన ఊపిరి తీసుకునే పైప్ ఎందుకు తీసుకురాలేందంటూ ప్రశ్నించడం. ఆ తర్వాత కూడా బాసిజం చూపించడం రివాజుగా మారింది. సైఫ్ వేధింపుల విషయం ప్రీతి తన తండ్రి నరేందర్‌కి తెలియ చేయగా, ఆయన స్ధానిక ఏసీపీ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్‌కు చెప్పగా, ఆయన హెచ్​వోడీకి తెలియజేశారు. ఇద్దరినీ పిలిపించి మాట్లాడారు. విభాగాధిపతితో ప్రీతి తన ఆవేదనను తెలియపరిచింది.

గ్రూపుల్లో ఎలాంటి సందేశాలు పెట్టద్దని కళాశాల ప్రిన్సిపల్, హెచ్‌వోడీ సైఫ్‌ని హెచ్చరించారు. ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్ పక్క గదిలో అపస్మారక స్ధితిలో పడి ఉన్న ప్రీతిని చూసి అక్కడి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన వచ్చి సీఎంఆర్ చేసి ఆర్‌ఐసీయూకి తరలించారు. మధ్యాహ్నం పరిస్ధితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కి తరలించారు.

ప్రీతి గదిలో ఇంజెక్షన్ సీసాలు: పోలీసుల దర్యాప్తులో ప్రీతి ఉన్న గదిలో కొన్ని ఇంజెక్షన్ సీసాలు లభించాయి. సక్సీనైల్ కోలిన్ ఇంజక్షన్ తీసుకుంటే.. ఏమవుతుందని ప్రీతి గుగూల్‌లో వెతికినట్లు పోలీసుల విచారణలో తేలింది. సీనియర్ సైఫ్ తరచూ వేధింపులకు గురి చేయడం దానిని అవమానంగా భావించి మనస్తాపం చెందడంతో, ప్రీతి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

ప్రీతినే లక్ష్యంగా.. సైఫ్ వేధింపులు: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపగా, పోలీసులు సవాల్‌గా తీసుకుని కేసును విచారించారు. ఈ కేసులో వాట్సప్ సంభాషణలు కీలకంగా మారాయి. ప్రీతిని లక్ష్యంగా చేసుకునే సైఫ్ వేధింపులకు గురి చేశాడని పోలీసు ఉన్నతాధికారుల విచారణలో ప్రాథమికంగా వెల్లడైంది. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్‌ను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటితో పాటు ర్యాగింగ్ యాక్ట్, ఆత్మహత్య కేసు నమోదు చేశారు. ప్రిన్సిపల్‌, హెచ్​వోడీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రీతి మృతితో కాకతీయ వైద్య కళాశాలతో పాటు ఎంజీఎం ఆసుపత్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి:

ప్రీతిని బతికించేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నినా.. ఫలితం దక్కలేదు..!

PG Medical student Preethi Died: నిత్యం నవ్వతూ చలాకీగా ఉండే పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి... 26 ఏళ్లకే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన విద్యా కుసుమం... అర్థాంతరంగా అందరికీ దూరమైంది. పరిస్ధితి అత్యంత విషమమని వైద్యులు ఎప్పటికప్పుడు చెబుతున్నా ఎక్కడో ఓ చిన్న ఆశ. ఆమె మృత్యుముఖం నుంచి బయటకు వస్తుందని, రావాలని అంతా ఆశించారు.

కన్నబిడ్డలాగే భావించి, క్షేమంగా తిరిగిరావాలని ప్రార్ధించారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ప్రీతి ఇక సెలవంటూ... శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. కన్నవారు, తోబుట్టువులకు, ఇతర కుటుంబసభ్యులకు.. తోటి విద్యార్ధులకు తీరని వేదనని మిగిల్చింది. ధరావత్ ప్రీతి కాకతీయ వైద్య కళాశాలలో అనస్తీషియా పీజీ మొదటి సంవత్సరం విద్యార్ధిని.

Kakatiya Medical College Preethi Died: స్వస్ధలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి శివారు గిర్నితండా. తండ్రి ధరావత్ నరేందర్ హైదరాబాద్‌లో ఆర్పీఎఫ్​లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. హాస్టల్‌లో ఉంటూ వైద్యవిద్యను అభ్యసిస్తున్న ప్రీతి పట్ల సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ మొదటి నుంచి కోపాన్ని ప్రదర్శించేవాడని తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో కళాశాలలో చేరిన నాటి నుంచి నిందితుడు సైఫ్‌తో రోజూ ఇబ్బందులే.

డిసెంబర్ 6న రోగికి అవసరమైన ఊపిరి తీసుకునే పైప్ ఎందుకు తీసుకురాలేందంటూ ప్రశ్నించడం. ఆ తర్వాత కూడా బాసిజం చూపించడం రివాజుగా మారింది. సైఫ్ వేధింపుల విషయం ప్రీతి తన తండ్రి నరేందర్‌కి తెలియ చేయగా, ఆయన స్ధానిక ఏసీపీ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్‌కు చెప్పగా, ఆయన హెచ్​వోడీకి తెలియజేశారు. ఇద్దరినీ పిలిపించి మాట్లాడారు. విభాగాధిపతితో ప్రీతి తన ఆవేదనను తెలియపరిచింది.

గ్రూపుల్లో ఎలాంటి సందేశాలు పెట్టద్దని కళాశాల ప్రిన్సిపల్, హెచ్‌వోడీ సైఫ్‌ని హెచ్చరించారు. ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్ పక్క గదిలో అపస్మారక స్ధితిలో పడి ఉన్న ప్రీతిని చూసి అక్కడి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన వచ్చి సీఎంఆర్ చేసి ఆర్‌ఐసీయూకి తరలించారు. మధ్యాహ్నం పరిస్ధితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కి తరలించారు.

ప్రీతి గదిలో ఇంజెక్షన్ సీసాలు: పోలీసుల దర్యాప్తులో ప్రీతి ఉన్న గదిలో కొన్ని ఇంజెక్షన్ సీసాలు లభించాయి. సక్సీనైల్ కోలిన్ ఇంజక్షన్ తీసుకుంటే.. ఏమవుతుందని ప్రీతి గుగూల్‌లో వెతికినట్లు పోలీసుల విచారణలో తేలింది. సీనియర్ సైఫ్ తరచూ వేధింపులకు గురి చేయడం దానిని అవమానంగా భావించి మనస్తాపం చెందడంతో, ప్రీతి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

ప్రీతినే లక్ష్యంగా.. సైఫ్ వేధింపులు: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపగా, పోలీసులు సవాల్‌గా తీసుకుని కేసును విచారించారు. ఈ కేసులో వాట్సప్ సంభాషణలు కీలకంగా మారాయి. ప్రీతిని లక్ష్యంగా చేసుకునే సైఫ్ వేధింపులకు గురి చేశాడని పోలీసు ఉన్నతాధికారుల విచారణలో ప్రాథమికంగా వెల్లడైంది. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్‌ను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటితో పాటు ర్యాగింగ్ యాక్ట్, ఆత్మహత్య కేసు నమోదు చేశారు. ప్రిన్సిపల్‌, హెచ్​వోడీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రీతి మృతితో కాకతీయ వైద్య కళాశాలతో పాటు ఎంజీఎం ఆసుపత్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.