వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ ఛీప్ విప్ వినయ్ భాస్కర్ నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని సాయం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలను ప్రజలందరూ తూ.చ తప్పకుండా పాటించాలని కోరారు.