ETV Bharat / state

పేదల సంక్షేమం కేసీఆర్ కోసం విశేష కృషి: వినయభాస్కర్​ - warangal latest news

దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని ప్రభుత్వ చీఫ్​ విప్​, వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్​ తెలిపారు. హన్మకొండలో 60 మంది లబ్ధిదారులకు రూ.42 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందించారు.

warangal news
పేదల సంక్షేమం కోసం విశేష కృషి: వినయభాస్కర్​
author img

By

Published : Dec 17, 2020, 4:28 PM IST

పేదల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తోందని ప్రభుత్వ చీఫ్​ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్​, ఎంపీ సంతోష్ కుమార్, ప్రభుత్వ చీఫ్ ​విప్​ వినయ్ భాస్కర్.. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

60 మంది లబ్ధిదారులకు రూ.42 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. చెక్కులతో పాటు మొక్కలనూ అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్​.. సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతున్నట్లు వినయ్​భాస్కర్​ పేర్కొన్నారు.

పేదల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తోందని ప్రభుత్వ చీఫ్​ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్​, ఎంపీ సంతోష్ కుమార్, ప్రభుత్వ చీఫ్ ​విప్​ వినయ్ భాస్కర్.. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

60 మంది లబ్ధిదారులకు రూ.42 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. చెక్కులతో పాటు మొక్కలనూ అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్​.. సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతున్నట్లు వినయ్​భాస్కర్​ పేర్కొన్నారు.

ఇవీచూడండి: స్లాట్ బుకింగ్ పేరుతో ప్రజలను గందరగోళం చేయొద్దు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.