ETV Bharat / state

ETELA: 'తెరాస నాయకులు ఎన్ని పైసలిచ్చినా తీసుకోండి.. అవన్నీ మనయే'

author img

By

Published : Jul 20, 2021, 4:16 PM IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్​ చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. గూడూరు, నేరెళ్ల, లక్ష్మీపూర్‌, కాశింపల్లి, పంగిడిపల్లి, వంగపల్లి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగుతోంది. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు.

etela rajender padayatra in kamalapur Mandal
etela rajender padayatra in kamalapur Mandal


హుజూరాబాద్‌లోని ఎస్సీలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలో ఈటల చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. మండలంలోని గూడూరు, నేరెళ్ల, లక్ష్మీపూర్‌, కాశింపల్లి, పంగిడిపల్లి, వంగపల్లి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగుతోంది. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు. డప్పు బృందాలు, కోలాట కళాకారుల నృత్యాలతో దారి పొడవునా.. ప్రదర్శనలతో జనం నీరాజనం పలికారు. గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ.. ప్రజలను ఈటల కలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రైతు కూలీలతో ముచ్చట...

గూడూరు గ్రామశివారులో వరి పొలాల్లో నాటు వేస్తున్న కూలీల దగ్గరికి వెళ్లిన ఈటల వారితో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉప ఎన్నికల పుణ్యమా అని ఎస్సీ కుటుంబాల్లో మంచి ఆర్థిక పరిపక్వత కలగాలని ఆశిస్తున్నాట్లు ఈటల తెలిపారు. ఇది కేవలం హుజూరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ నిరుపేద ఎస్సీ కుటుంబాలున్నాయో వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని డిమాండ్​ చేశారు.

ఎంతిస్తే అంతా తీసుకోండి...

"నా లాంటి ఒక వ్యక్తికి భయపడి ప్రభుత్వం ఈరోజు ఎస్సీ సబ్​ ప్లాన్​ కింద రూ.2000 కోట్లు ఎస్సీల సంక్షేమం కోసం ఖర్చు చేయటం సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు హుజురాబాద్​ను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు మాత్రం వరాలు కురిపిస్తోంది. కేవలం హుజురాబాద్​లోని ఎస్సీలనే కాకుండా... రాష్ట్రంలోని నిరుపేద ఎస్సీ కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలి. ఎన్నికల్లో తెరాస.. విచ్చలవిడిగా డబ్బులు పంచుతుంది. ఎన్నిస్తే అన్ని తీసుకోండి. ఎందుకంటే అవన్ని మన డబ్బులే. ఓటు మాత్రం కమలానికి వేయ్యండి. నేను మీ బిడ్డను. మీ ఓట్లతో నన్ను ఆశీర్వదించండి."

- ఈటల రాజేందర్​, మాజీ మంత్రి, హుజూరాబాద్​ భాజపా అభ్యర్థి

'తెరాస నాయకులు ఎన్ని పైసలిచ్చినా తీసుకోండి.. అవన్నీ మనయే'

ఇదీ చూడండి: గంగుల సవాల్... కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణకు 'ఈటల' సిద్ధమా?


హుజూరాబాద్‌లోని ఎస్సీలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలో ఈటల చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. మండలంలోని గూడూరు, నేరెళ్ల, లక్ష్మీపూర్‌, కాశింపల్లి, పంగిడిపల్లి, వంగపల్లి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగుతోంది. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు. డప్పు బృందాలు, కోలాట కళాకారుల నృత్యాలతో దారి పొడవునా.. ప్రదర్శనలతో జనం నీరాజనం పలికారు. గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ.. ప్రజలను ఈటల కలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రైతు కూలీలతో ముచ్చట...

గూడూరు గ్రామశివారులో వరి పొలాల్లో నాటు వేస్తున్న కూలీల దగ్గరికి వెళ్లిన ఈటల వారితో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉప ఎన్నికల పుణ్యమా అని ఎస్సీ కుటుంబాల్లో మంచి ఆర్థిక పరిపక్వత కలగాలని ఆశిస్తున్నాట్లు ఈటల తెలిపారు. ఇది కేవలం హుజూరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ నిరుపేద ఎస్సీ కుటుంబాలున్నాయో వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని డిమాండ్​ చేశారు.

ఎంతిస్తే అంతా తీసుకోండి...

"నా లాంటి ఒక వ్యక్తికి భయపడి ప్రభుత్వం ఈరోజు ఎస్సీ సబ్​ ప్లాన్​ కింద రూ.2000 కోట్లు ఎస్సీల సంక్షేమం కోసం ఖర్చు చేయటం సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు హుజురాబాద్​ను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు మాత్రం వరాలు కురిపిస్తోంది. కేవలం హుజురాబాద్​లోని ఎస్సీలనే కాకుండా... రాష్ట్రంలోని నిరుపేద ఎస్సీ కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలి. ఎన్నికల్లో తెరాస.. విచ్చలవిడిగా డబ్బులు పంచుతుంది. ఎన్నిస్తే అన్ని తీసుకోండి. ఎందుకంటే అవన్ని మన డబ్బులే. ఓటు మాత్రం కమలానికి వేయ్యండి. నేను మీ బిడ్డను. మీ ఓట్లతో నన్ను ఆశీర్వదించండి."

- ఈటల రాజేందర్​, మాజీ మంత్రి, హుజూరాబాద్​ భాజపా అభ్యర్థి

'తెరాస నాయకులు ఎన్ని పైసలిచ్చినా తీసుకోండి.. అవన్నీ మనయే'

ఇదీ చూడండి: గంగుల సవాల్... కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణకు 'ఈటల' సిద్ధమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.