నలుగురు చిన్నారులపై కుక్కల మూకుమ్మడి దాడి వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులు గాయపడ్డ ఘటన వరంగల్లో వెలుగు చూసింది. కరీమాబాద్లోని జన్మభూమి జంక్షన్ వద్ద పాఠశాలకు వెళ్తున్న నలుగురు చిన్నారులపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కుక్కల బెడదపై వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సకాలంలో అధికారులు స్పందించి ఉంటే తమ్మ పిల్లలకు ఇలా జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: 60మంది నేతలను బురిడీ కొట్టించిన కేటుగాడు