వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం, వీర్ల గడ్డ తండా, ధర్మారం గ్రామాల్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పర్యటించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామా పంచాయతీలకు కేటాయించిన నూతన ట్రాక్టర్లను ప్రారంభించారు. ఆనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామాల్లో 100 శాతం ఇంకుడు గుంతలు, స్మశాన వాటికలు పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి : 'ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగింది'