గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని భాజపా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం కడిపికొండ గ్రామంలోని 44వ డివిజన్ భాజపా అభ్యర్థి జలగం అనిత తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు.
గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం భాజపాదే: రేవూరి ప్రకాశ్ రెడ్డి
వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాల సందడి నెలకొంది. కాజీపేటలోని 44వ డివిజన్లో భాజపా అభ్యర్థి తరఫున మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
![గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం భాజపాదే: రేవూరి ప్రకాశ్ రెడ్డి bjp former mla revuri prakash reddy election campaign, warangal elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-vlcsnap-2021-04-25-13h53m01s982-2504newsroom-1619338999-566.jpg?imwidth=3840)
గత ఎన్నికల్లో గెలిచిన తెరాస కార్పొరేటర్లు ఆర్థికంగా ఎదిగారే తప్ప... డివిజన్ల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. భాజపాను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. తెరాసపై ఉన్న వ్యతిరేకతే తమకు విజయాన్ని చేకూరుస్తుందని భాజపా అభ్యర్థి అభిప్రాయపడ్డారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని భాజపా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం కడిపికొండ గ్రామంలోని 44వ డివిజన్ భాజపా అభ్యర్థి జలగం అనిత తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు.
గత ఎన్నికల్లో గెలిచిన తెరాస కార్పొరేటర్లు ఆర్థికంగా ఎదిగారే తప్ప... డివిజన్ల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. భాజపాను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. తెరాసపై ఉన్న వ్యతిరేకతే తమకు విజయాన్ని చేకూరుస్తుందని భాజపా అభ్యర్థి అభిప్రాయపడ్డారు.