వరంగల్ అర్బన్ జిల్లా కాశిబుగ్గలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నగర సంకీర్తన నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి అభిషేకం నిర్వహించి.. నగరంలోని వీధుల గుండా హరిహర తనయుని ఊరేగించారు.
నగరవాసులు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాముల భజన కీర్తనలతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఇదీ చూడండి: ఇన్ఫినిటీ రైడ్ను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై