నిత్యం మద్యం సేవించి భార్యను వేధిస్తున్న భర్తపై తన తల్లితో కలిసి కర్రలతో దాడి చేసి గాయపరిచిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటు చేసుకుంది. నల్లబెల్లి మండలం ఎర్రచెరువు తండాకు చెందిన లావుడ్య బాల్సింగ్ నిత్యం తాగొస్తూ తన భార్యను వేధింపులకు గురిచేసేవాడు.
ఈ క్రమంలో విసుగు చెందిన భార్య రమ్య తన తల్లితో కలిసి కర్రలతో దాడి చేసింది. సమాచారం తెలుసుకున్న నల్లబెల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాల్సింగ్ను ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి : రైలింజన్ ఢీకొని.. ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి