ETV Bharat / state

'పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

author img

By

Published : Jun 8, 2020, 6:33 PM IST

వర్ధన్నపేటలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం శరవేగంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ పేర్కొన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలో వాడవాడలా తిరుగుతూ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రజలకు ప్రబలకుండా వారికి అవగాహన కల్పించారు.

Vardanapeta MLA Aruri Ramesh Awareness on Seasonal diseases to peoples in Warangal rural district
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ వార్డుల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ పర్యటించారు. ఈ సందర్భంగా వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.

జూన్ 1 నుంచి నేటి వరకు చేపట్టిన పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే అధికారులను, స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ వార్డుల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ పర్యటించారు. ఈ సందర్భంగా వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.

జూన్ 1 నుంచి నేటి వరకు చేపట్టిన పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే అధికారులను, స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.